Delhi : రష్యా నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు కలకలం..!!
రష్యా రాజధాని మాస్కో నుంచి వస్తున్న విమానంలో బాంబు కలకలం రేపింది. ఫ్లైట్ లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో...అధికారులు అప్రమత్తమయ్యారు.
- By hashtagu Published Date - 08:52 AM, Fri - 14 October 22
రష్యా రాజధాని మాస్కో నుంచి వస్తున్న విమానంలో బాంబు కలకలం రేపింది. ఫ్లైట్ లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో…అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అయితే విమానంలో సిబ్బంది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. వార్తా సంస్థ ANI ప్రకారం, శుక్రవారం ఉదయం రష్యాలోని మాస్కో నగరం నుండి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కలకలం రేగింది. వెంటనే ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో తెల్లవారుజామున 3.20 గంటలకు విమానం ల్యాండ్ అయింది.
అయితే విమానంలో బాంబు ఉన్నట్లు ఎవరు సమాచారం ఇచ్చారో ఢిల్లీ పోలీసులు వెల్లడించలేదు. విమానంలో బాంబు ఉందని సమాచారం అందించిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఫ్లైట్ లో బాంబు ఉందని తెలిసిన వెంటనే అందులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులందరినీ సురక్షితంగా దించారు. విమానంపై దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ అధికారిక ప్రకటనలో తెలిపింది. విమానంలో బాంబు ఉందన్న విషయంపై ఢిల్లీ పోలీసులు కాసేపట్లో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Delhi IGI airport on alert after 'bomb threat' on flight from Moscow
Read @ANI Story | https://t.co/pAmNUhxpEQ#DelhiAirport pic.twitter.com/3CV8JgIDvV
— ANI Digital (@ani_digital) October 14, 2022
A call about a bomb in the flight coming from Moscow to Delhi was received last night. The flight landed in Delhi at around 3.20 am. All passengers and crew members were deboarded. Flight is being checked and investigation is underway: Delhi Police pic.twitter.com/2nDBWJhZWW
— ANI (@ANI) October 14, 2022
Related News
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.