Supreme Court : కేంద్రంపై సుప్రీం గుస్సా.. ప్రధానిని ప్రశ్నించే దమ్మునోడు కావాలి.!!
- By hashtagu Published Date - 11:44 AM, Thu - 24 November 22
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ వచ్చాక ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెండింగ్ లో ఉన్న అనేక కేసులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్ సభ్యుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సీఈసీ ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపిక పారదర్శకంగా లేదంటూ అత్యున్నత ధర్మాసనంలో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో ఎంతో సమర్థవంతంగా ఎలక్షన్స్ నిర్వహించిన దివంగత టీఎన్ శేషన్ లాంటి అధికారి కావాలంటూ వ్యాఖ్యానించింది.
Supreme Court reads the files related to the appointment of former IAS officer Arun Goel as the new Election Commissioner last week and questions the Centre about the fast-tracked clearance of files. pic.twitter.com/OUrbTzzT4S
— ANI (@ANI) November 24, 2022
ప్రధాని కూడా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న అధికారి కావాలని కుండ బద్ధలు కొట్టింది సుప్రీం. ఈసీల నియామకం సమయంలో సీజేఐని కూడా సంప్రదించాలని స్పష్టం చేసిన సుప్రీం…తాజాగా కేంద్రం నియమించిన అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సీఈసీ రాజకీయాలకు దూరంగా ఉండాలని..స్పష్టం చేసింది. 24గంటల్లో విచారణ ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. దీనిపై అటార్నీ జనరల్ అన్నింటికి సమాధానం చెబుతారని కనీసం మాట్లాడేందుకు కోర్టు అవకాశం ఇవ్వాలన్నారు.
Related News
Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్రెడ్డి భేటీ
Chandrachud: సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud)ను తెలంగాణ(telangana)ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా(Taj Falaknuma)లో ఉన్న ఆయనను కలిసిన రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో వంద ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్�