First Open Debate : భారత ఎన్నికల్లో తొలి ఓపెన్ డిబేట్.. సై అంటున్న ఆ ఇద్దరు !
First Open Debate : మన దేశంలోనే తొలి ఎలక్షన్ ఓపెన్ డిబేట్ కేరళలోని తిరువనంతపురం లోక్సభ స్థానం వేదికగా జరగబోతోంది.
- By Pasha Published Date - 02:09 PM, Mon - 8 April 24
First Open Debate : మన దేశంలోనే తొలి ఎలక్షన్ ఓపెన్ డిబేట్ కేరళలోని తిరువనంతపురం లోక్సభ స్థానం వేదికగా జరగబోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య ఈ బహిరంగ చర్చ జరగనుంది. నియోజకవర్గం పరిధిలోని రాజకీయాలు, అభివృద్ధి గురించి ఈ డిబేట్లో డిస్కస్ చేయనున్నారు. దీంతో ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది అనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
‘‘తిరువనంతపురం లోక్సభ స్థానానికి సంబంధించిన అభివృద్ధిపై థరూర్తో చర్చించేందుకు(First Open Debate) నేను రెడీ’’ అని ఇటీవల బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ రిప్లై ఇచ్చారు. రాజీవ్ విసిరిన సవాల్ను స్వీకరించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. బహిరంగ చర్చ నుంచి ఎవరు తప్పించుకుంటున్నారో ఓటర్లకు బాగా తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. ఓపెన్ డిబేట్లో పాల్గొనేందు.. కురాజకీయాలు, అభివృద్ధి గురించి మాట్లాడేందుకు సిద్ధమని శశిథరూర్ తేల్చి చెప్పారు. ధరల మంట, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం, బీజేపీ పదేళ్ల ద్వేషపూరిత రాజకీయాల గురించి మాట్లాడుకుందామన్నారు. గత 15 ఏళ్లలో తిరువనంతపురం అభివృద్ధి కోసం తాను చేసిన ప్రయత్నాల వివరాలను కూడా చెబుతానని శశిథరూర్ అంటున్నారు.
Also Read : Jan Lok Poll Survey : అసదుద్దీన్కు షాక్.. జన్ లోక్పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
తొలిసారిగా తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. స్థానికంగా బీజేపీకి ఉన్న పట్టు తనకు కలిసొస్తుందనే ఆశాభావంతో ఆయన ఉన్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజగోపాల్ పోటీ చేసి అద్భుత ఫలితాన్ని సాధించారు. ఆ ఎన్నికల్లో థరూర్ కేవలం 15వేల ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. చివరిసారిగా 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ తిరువనంతపురం అభ్యర్థిని మార్చింది. కాషాయ పార్టీ నుంచి పోటీచేసిన కుమ్మనం రాజశేఖరన్ను శశిథరూర్ దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడించారు. పోలైన మొత్తం ఓట్లలో 41 శాతం థరూర్కే దక్కాయి. మొత్తం మీద గత మూడు పర్యాయాలుగా తిరువనంతపురం లోక్సభ స్థానం శశిథరూర్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. కేరళలో పోలింగ్ ఏప్రిల్ 26న జరగబోతోంది. ఆరోజున ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో వేచిచూడాలి.
Also Read :Break Up Leaves : ఉద్యోగులకు బ్రేకప్ లీవ్స్.. సంచలన నిర్ణయంపైనే అంతటా చర్చ
Tags
Related News
MARD Party : ఎన్నికల బరిలో పురుషుల రాజకీయ పార్టీ ‘మర్ద్’
దేశంలో మహిళల హక్కుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.