HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Republic Day Celebrations In Delhi Indian Military Forces Displayed Their Power

Republic Day 2025 : రిపబ్లిక్ డే పరేడ్.. త్రివిధ దళాలు, నారీశక్తి శకటాలు అదుర్స్

అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో(Republic Day 2025) పాల్గొన్నాయి.

  • By Pasha Published Date - 12:52 PM, Sun - 26 January 25
  • daily-hunt
Republic Day Parade 2025 Droupadi Murmu Pm Modi Nari Shakti Drdo

Republic Day 2025 : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా పరేడ్‌‌ను నిర్వహించారు. దేశ చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌లో పరేడ్‌‌ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌‌లలో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్‌ రవీందర్‌జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు.  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు.  అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో అతివలు అందించిన కీలకమైన సహకారాన్ని అందులో ప్రదర్శించారు.

Also Read :Tik Tok Race : టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ కంపెనీ

ప్రదర్శించిన మిస్సైళ్లు, రాకెట్లు, యుద్ధ ట్యాంకులు ఇవే..

అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో(Republic Day 2025) పాల్గొన్నాయి. సుమారు 15మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై పాస్ట్‌లో తమ ప్రతిభను చూపారు. మొత్తం మీద ఈ వేడుకల్లో వికసిత భారత్‌, నారీ శక్తి  అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  ‘స్వర్ణిమ్‌ భారత్‌, విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ అనే థీమ్‌తో శకటాలను రూపొందించారు. ఇందులో భారత త్రివిధ దళాలు సత్తాచాటాయి. తమ శక్తిని యావత్ ప్రపంచానికి చూపించాయి. ‘సశక్త్‌ ఔర్‌ సురక్షిత్ భారత్‌’ అనే థీమ్‌తో  త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని ప్రదర్శించాయి. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీ-90 యుద్ధట్యాంక్‌ (భీష్మ), బీఎంపీ-2 శరత్‌తో పాటు నాగ్‌,  బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు, పినాక, అగ్నిబాణ్‌ మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్లు, ఆకాశ్‌ వెపన్ సిస్టమ్‌, చేతక్‌, బజరంగ్‌, ఐరావత్‌ సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు. ఈ పరేడ్‌లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు సందడి చేశాయి.

Also Read :Most Wanted Criminals : భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టాప్-5 నేరగాళ్లు ఎవరో తెలుసా ?

152 మంది ఇండోనేషియా నేషనల్‌ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్‌ కవాతు

300 మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని వాయించారు. అనంతరం గగనతలం నుంచి హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఇండోనేసియాకు చెందిన నేషనల్‌ ఆర్మ్‌డు ఫోర్సెస్‌ నుంచి 152 మంది బృందం కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బ్యాండ్‌ బృందం మార్చ్ నిర్వహించింది.అంతకుముందు రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాష్ట్రపతి ముర్ముతో కలిసి గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద భారత సైనిక దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DRDO
  • Droupadi Murmu
  • Nari Shakti
  • pm modi
  • Republic Day 2025
  • Republic Day Parade

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd