Covid Deaths: కోవిడ్ మరణాలపై రాజకీయాస్త్రం
కోవిడ్ మరణాలను దాచిందని డబ్యూహెచ్ చేసిన కామెంట్ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ అస్త్రంగా మారింది.
- By CS Rao Published Date - 01:46 PM, Fri - 6 May 22
కోవిడ్ మరణాలను దాచిందని డబ్యూహెచ్ చేసిన కామెంట్ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ అస్త్రంగా మారింది. మానవీయ కోణం నుంచి కోవిడ్ మరణాలను ఆలోచించాలని రాహుల్ కేంద్రంపై ట్విట్టర్ వేదికగా హితవు పలికారు. కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం కింద రూ. 4లక్షలు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం తెలిపిన దాని కంటే పది రెట్లు ఎక్కువగా కోవిడ్ మరణాలు ఉంటాయని రాహుల్ అంచనా వేశారు. ప్రస్తుతం కేంద్రం లెక్కించిన 4.8లక్షల కాదు, భారత్ లో 47 లక్షల మంది వరకు మరణించారని చెబుతున్నారు. ఆ విషయాన్ని పరోక్షంగా డబ్యూహెచ్ వో బయటపెట్టిందని మోడీ సర్కార్ పై రాహుల్ ఆరోపించారు.
2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మరణాలు కోవిడ్-19 కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అత్యధిక మరణాలు 84 శాతం ఆగ్నేయాసియా, యూరప్ , అమెరికాల్లో ఉన్నాయని, 68 శాతం ప్రపంచవ్యాప్తంగా కేవలం పది దేశాలలో కేంద్రీకృతమై ఉన్నాయని WHO తెలిపింది. 14.9 మిలియన్ల అదనపు మరణాలలో మధ్య-ఆదాయ దేశాలు 81 శాతంగా ఉన్నాయి, అయితే అధిక-ఆదాయ మరియు తక్కువ-ఆదాయ దేశాలు ఒక్కొక్కటి వరుసగా 15 మరియు 4 శాతంగా ఉన్నాయి.
ప్రపంచంలోని మరణాల సంఖ్య మహిళల కంటే (43 శాతం) పురుషులలో (57 శాతం) ఎక్కువగా ఉంది. వృద్ధులలో ఇంకా ఎక్కువ. గణిత నమూనాల ఆధారంగా అధిక మరణాల అంచనాలను అంచనా వేయడానికి WHO అనుసరించిన పద్దతిపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశం ఆందోళనలను తగినంతగా పరిష్కరించకుండా WHO అదనపు మరణాల అంచనాలను విడుదల చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) ద్వారా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) పద్ధతిన మరణాల సంఖ్యను అంచనా వేయడానికి గణిత నమూనాలను ఉపయోగించకూడదు అంటూ భారతదేశం కూడా WHOకి తెలియజేసింది. సరిగ్దా ఇక్కడే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags
Related News
Lok Sabha Poll : కాంగ్రెస్ పరువు తీస్తున్న మల్కాజ్ గిరి అభ్యర్థి..?
దేశం కోసం రాజీవ్ గాంధీ , ఇంద్ర గాంధీ వంటి వారు ప్రాణ త్యాగాలు చేసారని అని చెప్పబోయి.. ఇంద్రా గాంధీ, రాహుల్ గాంధీ లు ప్రాణాలు అర్పించారని చెపుతూ వస్తుంది