New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రధాని మోదీ!
- By hashtagu Published Date - 09:26 PM, Thu - 30 March 23
కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పలు పనులను పరిశీలించి అక్కడ ఉన్న కార్మికులతో ముచ్చటించారు. కొత్త పార్లమెంట్ హౌస్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ గంటకు పైగా అక్కడే గడిపారు. పార్లమెంట్ ఉభయ సభలను పరిశీలించిన ప్రధాని మోదీ వివిధ పనులను పరిశీలించారు.
Delhi | PM Narendra Modi went for a surprise visit to the new Parliament building. He spent more than an hour and inspected various works along with observing the facilities coming up at both houses of the Parliament: Sources pic.twitter.com/jecEv7fVBT
— ANI (@ANI) March 30, 2023
కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లోపల నుంచి చిత్రాలు తెరపైకి రావడం ఇదే తొలిసారి. కొత్త పార్లమెంట్ హౌస్ లోపల ఫోటోలు తెరపైకి వచ్చాయి. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రధాని ఆకస్మిక పర్యటనకు సంబంధించిన ఇప్పుడు వైరల్ గా మారాయి.
More visuals from PM Modi's surprise visit to the new Parliament building. He inspected various works along with observing the facilities coming up at both Houses of the Parliament: Sources pic.twitter.com/douoORAvb7
— ANI (@ANI) March 30, 2023
Related News
Kanhaiya Kumar: పూలమాల వేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై చెప్పుతో దాడి
కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్పై శుక్రవారం ఇద్దరు యువకులు దాడి చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కన్హయ్య కుమార్ను ఈ యువకులు చెప్పుతో కొట్టారు. అయితే అక్కడే ఉన్న కన్హయ్య మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.