Pramod Savath : రేపు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ప్రమోద్ సావంత్
గోవా సీఎంగా రేపు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు గెలుచుకుంది.
- By Dinesh Akula Published Date - 04:08 PM, Sun - 27 March 22
గోవా సీఎంగా రేపు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు గెలుచుకుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రమోద్ సావంత్ గెలిచారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని అధికారులు తెలిపారు. స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి 10,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న ఇతర కేబినెట్ మంత్రుల సంఖ్యపై బీజేపీ ఇప్పటి వరకు మౌనంగా ఉంది. రేపు బినెట్ మంత్రుల సంఖ్యపై క్లారిటీ వస్తుందని సావంత్ తెలిపారు. ప్రస్తుతం ఎంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారో తనకు తెలియదన్నారు.
గోవా కేబినెట్లో ముఖ్యమంత్రితో పాటు మరో 11 మంది మంత్రులు ఉండవచ్చు. 2012లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్ర రాజధాని పనాజీలోని క్యాంపల్ గ్రౌండ్లో మనోహర్ పారికర్ సీఎంగా ప్రమాణం చేశారు. ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో 40 మంది సభ్యుల సభలో మెజారిటీకి ఒకటి తక్కువగా బిజెపి 20 స్థానాలను గెలుచుకుంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)కి చెందిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు శాసనసభ్యులు బిజెపికి మద్దతు పలికారు. సావంత్ ఉత్తర గోవాలోని సంఖలిమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు. పారికర్ మరణం తర్వాత 2019 మార్చిలో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Related News
Goa Politics : `గోవా`సంకీర్ణ పాలి`ట్రిక్స్`
ఎగ్జిట్ పోల్స్ తరువాత కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి గోవా మీద ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి.