Delhi : గ్రేటర్ నోయిడాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్..!!
- By hashtagu Published Date - 07:45 PM, Tue - 1 November 22
గ్రేటర్ నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లోపల భారతీయ కిసాన్ పరిషత్ కు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఈ ఘటనలో మహిళా రైతులు గాయపడ్డారు.
గ్రేటర్ నోయిడాలోని దాద్రీ సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన పవర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం 35ఏళ్ల క్రితం 23 గ్రామాల్లో భూమిని సేకరించారు. దీనికోసం అప్పటి ప్రభుత్వం రైతులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినప్పటికీ…ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. భూసేకరణ వల్ల నష్టపోయిన రైతులకు ఎన్టీపీసీలో ఉపాధి అవకాశాలు, సమాన పరిహారం అందడం లేదు. ఈ డిమాండ్లపై భారతీయ కిసాన్ పరిషత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం చేరుకున్నారు. ఈనేపథ్యంలోనే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతలు ఆందోళనకు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు…లాఠీఛార్జీ చేశారు.
Tags
Related News
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని