Honey Trap in Odisha: నా దగ్గర వీడియోలున్నాయి.. బయట పెడితే స్టేట్ షేక్ అవుతుంది: అర్చనా నాగ్
ఒడిశా రాష్ట్రాన్ని ఊపేస్తున్న అర్చనా నాగ్ అరెస్ట్
- By Nakshatra Published Date - 11:01 PM, Tue - 6 December 22
తన అందంతో వల వేసి ఎంతోమందిని బుట్టలో వేసుకున్న ఓ అమ్మాయి కథ ఇప్పుడు ఈడీకి చేరింది. ప్రముఖులను తన అందంతో లోబర్చుకొని, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు మరియు వీడియోలతో బెదిరించి కోట్లు సంపాదించిన ఓ మహిళ.. వ్యవహారం ఇప్పుడు ఓ రాష్ట్రాన్నే కుదిపేస్తోంది. ఆమె వల్ల ఏ ప్రముఖుడి పేరు బయటకు వస్తుందా? ఏ వీడియో ఎప్పుడు లీక్ అవుతుందా? అనే భయం అక్కడి ప్రముఖుల్లో మొదలైంది.
ఒడిశా రాష్ట్రంలో ఇప్పుడు ఒక మహిళ అరెస్టు రాష్ట్రాన్ని షేక్ చేస్తోందంటే నమ్మాల్సిందే. అర్చనా నాగ్ అనే మహిళను తాజాగా ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఝార్పాడ ప్రత్యేక జైలు నుండి భువనేశ్వర్ లోని క్యాపిటల్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వీడియాతో మాట్లాడిన మాటల వల్ల రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టాయి.
ఈడీ కస్టడీలో ఉన్న అర్చనా నాగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విచారణ కోసమే ఎదురుచూస్తున్నా. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా. అయితే నాకు మాట్లాడటానికి తగినంత సమయం కావాలి. కనీసం 30నిమిషాలైనా అవసరం. నేను మాట్లాడితే రాష్ట్రం మొత్తం సీన్ మారిపోతుంది. నన్ను ట్రాప్ లో పడేశారు. ఎక్స్ క్లూజివ్ ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టను’ అంటూ బాంబు పేల్చింది.
ఒడిశాలో సెక్స్ రాకెట్ తో పాటు డబ్బున్న వాళ్లను వలలో వేసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అర్చనా నాగ్ కోట్ల రూపాయలు పోగేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె డబ్బు సంపాదించిన దానిలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని గుర్తించిన ఈడీ అధికారులు.. ఆ కోణంపై దర్యాప్తు మొదలుపెట్టారు. కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలో భువనేశ్వర్ లోని సత్యవిహార్ లో మూడంతస్తుల విశాలమైన బంగళాతో పాటు రూ.30కోట్ల వరకు ఆస్తులను ఆమె కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అర్చనా నాగ్ అరెస్టుతో ఒడిశాలోని ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆమె ఎవరి పేరును చెబుతుందా అనే ఆసక్తి నెలకొనగా.. మీడియా కనిపిస్తే చాలు ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ఈడీ అధికారులతో అర్చనా నాగ్ ఎలాంటి విషయాలను బయట పెడుతుందో, ఆస్తులు ఎలా కూడబెట్టిందో తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఎలాంటి వాస్తవాలను బయటకు లాగుతారో అనే ఆసక్తి ఒడిశాలో నెలకొంది.
Tags
Related News
Bus Falls Off Flyover : ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన బస్సు.. ఐదుగురి మృతి, 40 మందికి గాయాలు
Bus Falls Off Flyover : ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.