Change In Constitution : రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన లేదు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Change In Constitution : కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 12:18 PM, Sat - 16 March 24
బీజేపీ ఎంపీలతో ఇదంతా కావాలనే చెప్పిస్తున్నారు : ఖర్గే
బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. రాజ్యాంగంలోని లౌకికవాదం, సామాజిక న్యాయానికి అధికార బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు. ఇది మంచి ఆలోచనా విధానం కాదని, దేశంలో ఘర్షణలు సృష్టిస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించడానికే బీజేపీ భారీ మెజారిటీని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. ‘‘బీజేపీ రాజ్యాంగాన్ని ఇంకా పూర్తిగా ఆమోదించలేదని చెప్పడానికి బాధ పడుతున్నాను. ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చబోమని ప్రధాని మోడీ చెబుతున్నారు. కానీ ఆయన పార్టీ వ్యక్తులతో మారుస్తామని చెప్పిస్తున్నారు. మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే సవరిస్తామని పార్టీ నేతలు అంటున్నారు. ఇవే వ్యాఖ్యలు మా పార్టీలో ఎవరైనా చేస్తే వారిని కచ్చితంగా తొలగిస్తాను. ఒకవేళ అంబేడ్కర్ను బీజేపీ గౌరవిస్తే, వెంటనే అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి తొలగించాలి. వారికి ఎన్నికల్లో టికెట్లు సైతం కేటాయించకూడదు’’ అని ఖర్గే తెలిపారు.
Related News
Rajveer Singh Diler: బీజేపీ ఎంపీ రాజ్వీర్ సింగ్ మృతి
బీజేపీ హత్రాస్ ఎంపీ రాజ్వీర్ సింగ్ దిలేర్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు 66 ఏళ్లు. అలీగఢ్లోని ఆయన నివాసంలో సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి స్పృహతప్పి పడిపోయారు. బంధువులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.