Twitter War : `మోడీ`పై ఆ ముగ్గురు ట్విట్టర్ వార్
ప్రధాని నరేంద్ర మోడీ వాలకాన్ని ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్, ప్రధాన కార్యదర్శి ప్రియాంక, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంయుక్తంగా తప్పుబట్టారు.
- By CS Rao Published Date - 04:00 PM, Wed - 17 August 22
ప్రధాని నరేంద్ర మోడీ వాలకాన్ని ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్, ప్రధాన కార్యదర్శి ప్రియాంక, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంయుక్తంగా తప్పుబట్టారు. ఆజాదీ కా అమృతమహోత్సవ్ సందర్భంగా గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో ను రేప్ చేసిన నిందితులను విడుదల చేయడాన్ని ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. ఎర్రకోటపై ప్రధాని మోడీ చెప్పిన దానికి చేతలకు పూర్తి భిన్నంగా ఆయన వ్యవహారం ఉందని రాహుల్ విమర్శించారు.
గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ పాలసీ ప్రకారం బిల్కిస్ బానోపై రేపిస్టులు గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రాహుల్ తీవ్రంగా స్పందించారు. “5 నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, ఆమె 3 ఏళ్ల బాలికను చంపిన వారిని ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్’ సమయంలో విడుదల చేశారు. మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రధానమంత్రి గారూ, మీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తోంది.` అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
5 महीने की गर्भवती महिला से बलात्कार और उनकी 3 साल की बच्ची की हत्या करने वालों को 'आज़ादी के अमृत महोत्सव' के दौरान रिहा किया गया।
नारी शक्ति की झूठी बातें करने वाले देश की महिलाओं को क्या संदेश दे रहे हैं?
प्रधानमंत्री जी, पूरा देश आपकी कथनी और करनी में अंतर देख रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2022
2002 గోద్రా అనంతర బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ ఆ తరువాత ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో పదకొండు మంది నిందితులకు జీవితకాలం జైలు శిక్ష విధించబడింది. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించింది. దీంతో గోద్రా సబ్ జైలు నుండి బయటకు వచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఎర్రకోట నుంచి తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, మహిళల పట్ల మనస్తత్వం మార్చుకోవాలని, మహిళలను గౌరవించాలని ప్రజలను కోరారు.
एक गर्भवती महिला के साथ गैंगरेप व उसकी बच्ची की हत्या के अपराध में सभी अदालतों से सजा पा चुके अपराधियों की भाजपा सरकार द्वारा रिहाई, कैमरे के सामने स्वागत- क्या अन्याय व संवेदनहीनता की पराकाष्ठा नहीं है? @narendramodi जी स्त्री का सम्मान केवल भाषणों के लिए? महिलाएं पूछ रही हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 17, 2022
ఇదే తరహాలో, బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నిస్తూ, “ఇది అన్యాయం , సున్నితత్వం ఎత్తు కాదా?” అని ప్రశ్నించారు.
Dear PM @narendramodi Ji,
If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏
Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation
— KTR (@KTRTRS) August 17, 2022
“గర్భిణిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన నేరంలో అన్ని కోర్టుల నుండి దోషులుగా తేలిన నేరస్థులను బిజెపి ప్రభుత్వం విడుదల చేయడం అన్యాయం మరియు సున్నితత్వం? @narendramodi ప్రసంగాలకే మహిళలకు గౌరవం? ” అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ కేసులో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు కోరారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, “మహిళలను గౌరవించడం గురించి మీరు మాట్లాడే ఉద్దేశ్యం నిజంగా ఉంటే, జోక్యం చేసుకుని 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం విధించిన రిమిషన్ ఆర్డర్ను రద్దు చేయాలని కోరారు.
Related News
PM Modi : ప్రధాని మోడీ ప్రసంగాలపై పిటిషన్ల్..తొసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Lok Sabha elections: ప్రధాని మోడీ(PM Modi) లోక్సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు(Religious divisive speeches) చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘీంచారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్(petitions)ను ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) సోమవారం రోజు తోసిపుచ్చింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని, విచారణకు అర్హమైనది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు. We’re now on WhatsApp. Click