Bharat Shakti Exercise : గర్జించిన పోఖ్రాన్.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లతో సందడి
Bharat Shakti Exercise : తేజస్ యుద్ధ విమానాల నుంచి డ్రోన్ విధ్వంసక వ్యవస్థల దాకా.. ఆధునిక తుపాకుల నుంచి క్షిపణుల దాకా ప్రతీదీ వాడుకొని భారత సైన్యం రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో 50 నిమిషాలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
- By Pasha Published Date - 04:37 PM, Tue - 12 March 24
Bharat Shakti Exercise : తేజస్ యుద్ధ విమానాల నుంచి డ్రోన్ విధ్వంసక వ్యవస్థల దాకా.. ఆధునిక తుపాకుల నుంచి క్షిపణుల దాకా ప్రతీదీ వాడుకొని భారత సైన్యం రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో 50 నిమిషాలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఆయా ఆయుధాలతో శత్రుమూకలను ఎలా తుద ముట్టిస్తారో కళ్లకు కట్టేలా ఈ ప్రదర్శన కొనసాగింది. ‘భారత్ శక్తి’ పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనతో భారత ఆర్మీ సత్తా యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ ప్రదర్శనను నేరుగా అక్కడి వేదికపై కూర్చొని తిలకించిన వారిలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు 30కిపైగా దేశాల ప్రతినిధులు ఉన్నారు. ‘‘భారత్ శక్తి విన్యాసాల సమయంలో గగనతలంలో విమానాల గర్జన, నేలపై ప్రదర్శించబడిన శౌర్యం నవ భారతదేశానికి నాంది లాంటిది’’ అని ఈసందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారతదేశం యొక్క ఆత్మనిర్భరత, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం అనే త్రిశక్తులకు పోఖ్రాన్ సాక్షిగా నిలిచిందని కొనియాడారు.
#WATCH | Rajasthan | Prime Minister Narendra Modi along with delegates from more than 30 countries will witness exercise "Bharat Shakti" at the Pokhran field firing range in Jaisalmer. The exercise will display the firepower capability of indigenous weapons and the operational… pic.twitter.com/LQJMmHWecn
— ANI (@ANI) March 12, 2024
We’re now on WhatsApp. Click to Join
- ‘భారత్ శక్తి’ సైనిక విన్యాసాల్లో(Bharat Shakti Exercise) భాగంగా తేజస్ యుద్ధవిమానాలు శత్రు శిబిరాలు, బంకర్లను ధ్వంసం చేశాయి.
- గ్రాడ్ బీఎం 21 రాకెట్ లాంఛర్లు, ధనుష్ గన్ వ్యవస్థ, షారంగ్ గన్ సిస్టమ్ శత్రు స్థావరాలపై విరుచుకుపడ్డాయి.
- K9 వజ్ర యుద్ధ ట్యాంకు శత్రు బంకర్లను తుత్తునియలు చేసింది.
- డ్రోన్ల ద్వారా శత్రు స్థావరాలను ఎలా టార్గెట్ చేయొచ్చో చేసి చూపించారు.
- BMP-2 యుద్ధ ట్యాంకర్లు దుమ్మురేపుకుంటూ దూసుకుపోయాయి.
- అర్జున యుద్ధ ట్యాంకుల పని తీరు ఆకట్టుకుంది.
- భారత వాయుసేనకు చెందిన తేలికపాటి సైనిక హెలికాఫ్టర్ LH మార్క్-4 చేసిన ఫైరింగ్ అబ్బురపరిచింది.
- బ్రిడ్జి లేయింగ్ ట్యాంకులతో గగనతల లక్ష్యాలను పేల్చేశారు.
- వాయుసేనకు చెందిన షిక్రా మానవ రహిత విమానాన్ని.. మన దేశీయ తయారీ BLT-72 ట్యాంకులు గగన తలంలోనే ధ్వంసం చేశాయి.
- శత్రువులు పంపే డ్రోన్లను అడ్డుకునే నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ సత్తా చాటింది. డ్రోన్ను ధ్వంసం చేసింది.
- క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్, ఇన్ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్, లైట్ బులెట్ ప్రూఫ్ వాహనాల సాయంతో యుద్ధక్షేత్రంలో సైనికుల పోరాటాన్ని కళ్లకు కట్టారు.
- ‘భారత్ శక్తి’ సైనిక విన్యాసాల్లో T-90 యుద్ధ ట్యాంకులు, ధనుష్ అండ్ సారంగ్ గన్ సిస్టమ్స్, ఆకాష్ వెపన్స్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ డ్రోన్స్, రోబోటిక్ మ్యూల్స్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Also Read :Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
#WATCH | Rajasthan | Prime Minister Narendra Modi, along with delegates from more than 30 countries, witnesses exercise "Bharat Shakti" at the Pokhran field firing range in Jaisalmer. pic.twitter.com/33u8BewMQU
— ANI (@ANI) March 12, 2024
Related News
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.