Goa : రాజకీయ సంక్షోభంలో గోవా కాంగ్రెస్
గోవాలో ఎమ్మెల్యేల సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎమ్మెల్యే మైఖేల్ లోబోను విపక్షాల నేతగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
- By hashtagu Published Date - 08:08 AM, Mon - 11 July 22
గోవాలో ఎమ్మెల్యేల సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎమ్మెల్యే మైఖేల్ లోబోను విపక్షాల నేతగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ గోవా ఇంచార్జీ దినేష్ గుండురావు తెలిపారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడకుండా చూడాలని ఫిరాయింపులు చేయాలని బీజేపీతో కలిసి సొంత నేతలు కొందరు కుట్ర చేశారు. ఈ కుట్రకు మన స్వంత నాయకులైన లోపి మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ నాయకత్వం వహించారని పేర్కొన్నారు. బీజేపీతో జట్టు కట్టేందుకు లోబో, కామత్ పనిచేశారని ఆరోపించారు. తనపై ఉన్న కేసులను తప్పించుకునేందుకే దిగంబర్ కామత్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. మరోవైపు లోబో అధికార దాహంతో పొత్తుకు చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
కాగా గోవా కాంగ్రెస్ సంక్షోభంలో పడింది. రాష్ట్ర అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీతో టచ్ లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది కాంగ్రెస్. బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 40కోట్లు ఆఫర్ చేశారని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. అయితే గిరిష్ చోడంకర్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేలను సంప్రదించి డబ్బు ఆఫర్ చేయడంపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని గోవా బీజేపీ రాష్ట్ర్ అధ్యక్షుడు సదానంద్ అన్నారు.
Tags
Related News
First Private Train : దేశంలోనే తొలి ప్రైవేటు రైలు.. ఏ రూట్లలో నడుస్తుందో తెలుసా ?
First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ?