Udhampur Bomb Blast : ఉధంపూర్ లో భారీ పేలుళ్లు..!!!
జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ లో భయాందోళన వాతావరణం నెలకొంది. గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.
- By hashtagu Published Date - 08:07 AM, Thu - 29 September 22
జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ లో భయాందోళన వాతావరణం నెలకొంది. గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో మొదటి బాంబు పేలుడు జరగగా, ఉధంపూర్ బాంబ్ స్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఇవాళ తెల్లవారు జామున 5.42 గంటలకు రెండో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. రెండో బాంబు పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
जम्मू-कश्मीर: उधमपुर में एक और रहस्यमयी धमाका हुआ। पिछले 8 घंटे में दूसरा धमाका हुआ। https://t.co/Yrkq9skTZG pic.twitter.com/G5Tqyu9is6
— ANI_HindiNews (@AHindinews) September 29, 2022
పేలుడు ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉధంపూర్-రామ్నగర్ మధ్య తిరుగుతున్న జేకే14సీ-3636 బస్సులో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి బస్సు దగ్ధం కాగా, సమీపంలో పార్క్ చేసిన ఇతర బస్సులు కూడా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ పేలుడు జరిగినప్పుడు బస్సులో ఎవరూ లేరు.
ఇది కూడా చదవండి: ముగ్గురు TRS ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్..!!
J&K | The blast occurred around 10:30 pm. Two people have been injured in the accident and vehicles parked nearby have also suffered damage. The reason for the blast is still not known. We are investigating the matter: Suleman Choudhary, DIG Udhampur-Reasi Range https://t.co/jaMcvTZN3F pic.twitter.com/XLRffQ6U0w
— ANI (@ANI) September 28, 2022
Related News
Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం (ఫిబ్రవరి 22) జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) ఇంటితో సహా 30కి పైగా ప్రదేశాలపై దాడులు చేసింది.