Mass hysteria: వెరీ డేంజర్ ‘మాస్ హిస్టిరియా’.. వింతగా ప్రవర్తిస్తున్న పిల్లలు!
- By Balu J Published Date - 01:11 PM, Fri - 30 December 22
నేటి యువత (youth) ఫోబియోతో భయపడుతున్నారు. ఇప్పటికే స్ట్రెస్, ఓవర్ వర్క్, స్లీప్ నెస్ లాంటి సమస్యలతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 29 మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు పాఠశాలలో అరుస్తూ స్పృహ తప్పి పడిపోయారు. కొందరు దైవ ఘటనగా అని చెబుతుంటే, మరి కొందరు ‘మాస్ హిస్టీరియా’ (Mass hysteria) అని అంటున్నారు. చంపావత్లోని అటల్ ఎక్సలెంట్ జిఐసి స్కూల్ లో ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి మంగళవారం పాఠశాలలో కొంతమంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. బుధవారం కూడా అదే జరిగింది. 29 మంది బాలికలు, ముగ్గురు అబ్బాయిలు ఒక్కొక్కరుగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో విద్యాశాఖ దీనిని మాస్ హిస్టీరియా ఘటనగా పేర్కొంది. విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం విద్యాశాఖ ఆరోగ్యశాఖను కోరింది.
మంగళవారం ఇంటర్వెల్ తర్వాత తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు (School Students) 24 మంది విద్యార్థినులు ఒక్కొక్కరుగా కేకలు వేశారు. పాఠశాలలో భయానక వాతావరణం నెలకొంది. కాసిన్ని మంచినీళ్లు తాగడంతో పరిస్థితి మెరుగుపడింది. ఏడుపుతో బాలికలు స్పృహతప్పి పడిపోయారు. బుధవారం కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఏడాది జిల్లాలోని పాఠశాలల్లో స్పృహతప్పి పడిపోవడం ఇది మూడోసారి కావడంతో విషయం చర్చనీయాంశమవుతోంది. ఇంతకు ముందు పాటి బ్లాక్లోని రామక్, పతిలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జిఐసి రామక్లో 39 మంది బాలికలకు కూడా ఇలాంటి మూర్ఛలు వచ్చాయి. అంతకుముందు ఇది బాగేశ్వర్లో కనిపించింది. ప్రభుత్వ జూనియర్ హైస్కూల్ రైఖోలీలో విద్యార్థినులు కిందపడిపోయాడు. నిరుత్సాహంతో విద్యార్థినులు పెద్ద గొంతుతో వింత వింత చేష్టలు చేశారు. రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. ఈ ఏడాది బాగేశ్వర్ జిల్లాలో ఇలాంటి మూడు కేసులు నమోదయ్యాయి. విద్యాశాఖ దీనిని మాస్ హిస్టీరియా (Mass hysteria) కేసుగా పేర్కొంటోంది.
మాస్ హిస్టీరియా అంటే ఏమిటి
ఇది సాధారణంగా సైకోసిస్ లేదా సైకలాజికల్ సమస్య అని ఇంటిగ్రేటెడ్ నర్సింగ్ కాలేజీ సైకియాట్రిస్ట్ డాక్టర్ రష్మీ రావత్ అంటున్నారు. దీని కారణంగా చాలామంది వింత వింతగా ప్రవర్తిస్తారు.
లక్షణాలు
మాస్ హిస్టీరియా (Mass hysteria) లక్షణాలు కడుపు లేదా తలనొప్పి, జుట్టు లాగడం, కొట్టడం, చుట్టూ పరిగెత్తడం, ఏడుపు, అరవడం, కోపం, నిరాశ, మూర్ఖత్వం, ఆకలి లేకపోవడం. నిద్రపోవడం.
ఏం చేయాలి (What next)
రోగిని మానసిక వైద్యుడికి చూపించడం అవసరం. హిప్నోథెరపీ ద్వారా కూడా చికిత్స సాధ్యమవుతుంది. ఎవరికైనా మూర్ఛ వచ్చినట్లయితే, అతన్ని వెంటిలేషన్ ప్రదేశంలో విశ్రాంతి ఇవ్వాలి. ఇంగువ, ఉల్లిపాయను వాసనను అందించాలి.