మన్మోహన్కు సెలవులిచ్చిన వెంకయ్యనాయుడు
మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
- By Hashtag U Published Date - 03:32 PM, Thu - 2 December 21
మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు అనుమతించారు. సెలవులకు సంబంధించిన దరఖాస్తు ఛైర్మన్ టేబుల్ వద్దకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు వెంకయ్య.
” డాక్టర్ మన్మోహన్ సింగ్ నుంచి లేఖ అందింది. అనారోగ్య కారణాలతో శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. అందుకు అనుమతిస్తున్నాం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరుగుతున్న మొత్తం శీతాకాల సమావేశాలకు సెలవులు మంజూరు చేస్తున్నాం. “- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్.
89 ఏళ్ల మన్మోహన్ సింగ్కు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. గుండె సంబంధింత సమస్యలతో గత అక్టోబర్లో దిల్లీలోని ఎయిమ్స్లో చేరారు సింగ్. అంతకుముందు పలుమార్లు బైపాస్ సర్జరీలు జరిగాయి.
Related News
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్�