Justice Sanjiv Khanna : సుప్రీంకోర్టు నూతన CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Justice Sanjiv Khanna : ప్రస్తుతం ఉన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది, దీనితో జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న పదవీ స్వీకారం చేయనున్నారు
- By Sudheer Published Date - 11:25 PM, Thu - 24 October 24

సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(Chief Justice of India)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Current Chief Justice of India DY Chandrachud) పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది, దీనితో జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న (November 11) పదవీ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకానికి ఆమోదం తెలిపారు.
జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 జనవరి 18న నియమితులయ్యారు. ఆయన 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ప్రవేశించారు. దిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న న్యాయమూర్తి. ఆయన న్యాయ ప్రస్థానం 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో చేరటంతో ప్రారంభమైంది. దిల్లీ హైకోర్టు మరియు ఇతర కోర్టుల్లో అనేక సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 2005లో ఆయన ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే 2006లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
సుప్రీం కోర్టులోని కీలక కేసుల్లో ఆయన తీర్పులు ప్రధాన పాత్ర వహించాయి. ఆయన ప్రస్తుత బాధ్యతల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా, భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు మరియు న్యాయ సేవలకు నూతన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయన రానున్న కాలంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా భారత న్యాయ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి తోడ్పడతారని భావిస్తున్నారు.
Read Also : Terror Attack : ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు మృతి