JNU Students: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మళ్లీ చెలరేగిన హింస.. కారణమిదే..?
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన, ప్రసిద్ధి చెందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) మరోసారి వివాదంలో చిక్కుకుంది. అయితే.. ఈసారి వివాదం విద్యార్థుల ఘర్షణకు సంబంధించినది కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించినది.
- By Gopichand Published Date - 07:20 AM, Wed - 25 January 23
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన, ప్రసిద్ధి చెందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) మరోసారి వివాదంలో చిక్కుకుంది. అయితే.. ఈసారి వివాదం విద్యార్థుల ఘర్షణకు సంబంధించినది కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించినది. ఢిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాని మోదీపై బీబీసీ చానల్ తీసిన డాక్యుమెంటరీ ప్రదర్శన సమయంలో కొంత మంది రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన ‘ఇండియా: మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ ప్రదర్శనపై వివాదం నెలకొంది. ఓ కథనం ప్రకారం.. డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లతో దాడి చేశారు.
నివేదికల ప్రకారం.. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ముందు JNU అధికారులు విద్యుత్తును నిలిపివేసింది. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన జనవరి 24న రాత్రి 9 గంటలకు యూనివర్సిటీలో జరగాల్సి ఉంది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించవద్దని కోరింది. JNU స్టూడెంట్స్ యూనియన్ వారి సలహాను పాటించలేదు. నిర్ణీత సమయంలో డాక్యుమెంటరీ ప్రదర్శన చేశారు. ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో డాక్యుమెంటరీ ప్రదర్శనను ఆపేందుకు అధికారులు ఇలా చేశారని విద్యార్థులు ఆరోపించారు. కరెంటు కోత తర్వాత విద్యార్థుల ఫోన్లకు డాక్యుమెంటరీని పంపిస్తామని, ఆపై విద్యార్థులంతా కలిసి చూస్తామని విద్యార్థి సంఘం ప్రకటించింది.
Also Read: Natu Natu: ఆస్కార్ బరిలో ‘నాటునాటు’ సాంగ్… సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్?
జనవరి 23న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్క్రీనింగ్ను నిలిపివేయాలని సలహా ఇచ్చింది. దీని తర్వాత అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్కు సంబంధించి JNU స్టూడెంట్స్ యూనియన్ కొన్ని ప్రశ్నలు వేసింది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఏదైనా సినిమా ప్రదర్శనకు అడ్మినిస్ట్రేషన్ అనుమతి తీసుకోవాలా? స్క్రీనింగ్కు సంబంధించి తమకు ఏ నియమం ప్రకారం సలహా జారీ చేయబడిందని విద్యార్థులు కూడా అడ్మినిస్ట్రేషన్ ను అడిగారు. విద్యార్థి సంఘం తరపున విద్యార్థులు డాక్యుమెంటరీని వీక్షించడం, ప్రదర్శించడం పూర్తిగా స్వచ్ఛందమైనదని, విశ్వవిద్యాలయంలో ఎటువంటి ఉద్రిక్తత సృష్టించకూడదని వారు అన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం వల్ల యూనివర్సిటీలోని వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
Tags
Related News
JNU : జేఎన్యూలో వామపక్షాల జయభేరి.. అధ్యక్షుడిగా ధనుంజయ్.. ఎవరు ?
JNU : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు ఆధిపత్యాన్ని చాటుకున్నారు.