Lord Ram Non-vegetarian: 14 ఏళ్లు అడవిలో నివసించిన రాముడు శాఖాహారి ఎలా అవుతాడు
రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ క్షమాపణలు చెప్పారు. రాముడు శాకాహారిని కాదని చేసిన ప్రకటనపై జితేంద్ర మాట్లాడుతూ నేను విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రాధేయపడ్డాడు
- By Praveen Aluthuru Published Date - 03:11 PM, Thu - 4 January 24

Lord Ram Non-vegetarian: రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ క్షమాపణలు చెప్పారు. రాముడు శాకాహారిని కాదని చేసిన ప్రకటనపై జితేంద్ర మాట్లాడుతూ నేను విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రాధేయపడ్డాడు నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదని తెలిపాడు.
జితేంద్ర అవద్ ఇంతకుముందు రాముడు శాకాహారుడు కాదని, అతను మాంసాహారమని చెప్పాడు.14 ఏళ్లుగా అడవిలో నివసించే వ్యక్తికి శాఖాహారం ఎలా దొరుకుతుందని ఎన్సీపీ నేత అన్నారు. రాముడిపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ నేతను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీనితో పాటు బిజెపి నాయకుడు రామ్ కదమ్ జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడితే రామభక్తులు ఎప్పటికీ క్షమించరని కూడా బీజేపీ పేర్కొంది. గాంధీ, నెహ్రూలు మాత్రమే మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారని జితేంద్ర అవద్ కామెంట్స్ కూడా వివాదానికి దారి తీశాయి. మహాత్మా గాంధీ ఓబీసీ అని, ఇది ఆర్ఎస్ఎస్కు ఆమోదయోగ్యం కాదన్నారు. గాంధీజీ హత్య వెనుక అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర అన్నారు.