Jayaprada : బీఆర్ఎస్లోకి జయప్రద.. ? పోటీ ఎక్కడి నుండి అంటే..
జయప్రదను బిఆర్ఎస్ లోకి చేర్చుకొని ఆమెను మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిల్చోపెట్టాలని కేసీఆర్
- By Sudheer Published Date - 05:59 PM, Sat - 19 August 23
చిత్రసీమలో ఎంతో గుర్తింపు తెచ్చుకొని , యావత్ ప్రేక్షకులను అలరించిన నటి జయప్రద (Jayaprada ). కేవలం చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోకూడా అదే స్థాయిలో రాణించింది. టీడీపీ (TDP) పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఈమె..ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీకి రాజీనామా చేసి..ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party)లో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ (Jaya prada rampur) నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైంది. రెండు సార్లు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ప్రజల మన్నలను పొందింది.
ములాయం సింగ్ యాదవ్ చేతి నుంచి సమాజ్ వాదీ పార్టీ.. అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లిన తర్వాత జయప్రదకు ఆదరణ లభించలేదు. జయప్రద రాజకీయ గురువు అయిన అమర్ సింగ్ చనిపోవడంతో.. రాజకీయంగా జయప్రద ఒంటరి అయ్యారు. ఇతర పార్టీల్లో చేరే ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె బిఆర్ఎస్ పార్టీ లో చేరేందుకు సిద్ధమైయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే జయప్రద బిఆర్ఎస్ లో చేరబోతుందని , ఏపీలోని రాజమండ్రి నుండి ఎంపీగా బరిలో దిగబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. తాజాగా మరోసారి జయప్రద బిఆర్ఎస్ లో చేరబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also : Vivek Plan Vs Ukraine War : అక్కడ రష్యాను ఓడించకుండానే.. అమెరికాను గెలిపిస్తా : వివేక్
ప్రస్తుతం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాలపై పూర్తి ఫోకస్ పెట్టాడు. మహారాష్ట్రలో ఇప్పటికే పెద్ద ఎత్తున వలసలు నడుస్తున్నాయి. అలాగే పలు చిన్న , చితక పార్టీలన్నీ కూడా బిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రద ను బిఆర్ఎస్ (BRS) లోకి చేర్చుకొని ఆమెను మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిల్చోపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడట. ఈ ప్రతిపాదనను జయప్రద వరకు వెళ్లగా..ఆమె సైతం మహారాష్ట్ర బరి పట్ల ఆసక్తిగానే ఉందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు బిఆర్అ ఎస్ నేతలు. కేవలం జయప్రదను మాత్రమే కాదు పలువురు సినీ ప్రముఖులకు కూడా కేసీఆర్ ఆహ్వానం పంపుతున్నట్లు వినికిడి. మరి ఎన్నికల సమయం నాటికీ ఎవరెవరు బిఆర్ఎస్ లో చేరతారో చూడాలి.
Read Also : World Cup 2023: టైటిల్ రేసులో భారత్ తో పాటు మరో నాలుగు జట్లు
Related News
TS : రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేటిఆర్ సమావేశం
Graduate MLC by-election: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసాయి. ఇక ఇప్పుడు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వంతు.. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యూహం, కార్యాచరణపై కేటీఆర్ చర్చించి.. దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తరపున ఏనుగుల ర�