Chandrayaan-3 : చంద్రయాన్ 3 ని ఇక మరచిపోవాల్సిందేనా..?
అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా అవి .. ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. వాటిని మేల్కొలిపేందుకు ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
- By Sudheer Published Date - 12:08 PM, Sat - 7 October 23
మొట్ట మొదటిసారి జాబిల్లి ఫై అడుగుపెట్టి ఇస్రో (ISRO) రికార్డు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇస్రో సాధించిన ఈ రికార్డు కు ప్రపంచం మొత్తం ఇండియా కు జై జైలు కొట్టింది. అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 (Chandrayaan-3) ని మరచిపోవాల్సిన టైం వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. విక్రమ్ ల్యాండర్ (Vikram lander ) ద్వారా చంద్రుడిపైకి పంపించిన ప్రజ్ఞాన్ రోవర్ ( Pragyan rover), చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ కూడా మూగబోయాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై దిగి 14 రోజుల పాటు చంద్రయాన్-3లోని ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. ఆ తర్వాత చంద్రుడిపై చీకటి కావడం వల్ల సెప్టెంబర్ 2న రోవర్, 4న ల్యాండర్ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా అవి .. ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. వాటిని మేల్కొలిపేందుకు ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో చంద్రుడిపై మళ్లీ పగటి సమయం ముగిసింది. రాత్రి సమయం ఆరంభమౌతోంది. అంటే చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తరువాత రెండోసారి చీకటి కాబోతోందక్కడ. అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చీకటి రోజులు ఆరంభమైనప్పుడు చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన చలి ఆరంభమౌతుంది. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్కు లేదు. ఫలితంగా వాటిపై ఆశలు వదిలేసుకున్నామని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ (AS Kiran Kumar) తెలిపారు.
ల్యాండర్, రోవర్లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని.. ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదని అన్నారు. చంద్రయాన్-3ని విశాల దృక్కోణంలో చూసినప్పుడు అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందని.. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువం పై చంద్రయాన్ కాలుమోపి.. ఇప్పటికే ఆ రీజియన్ నుంచి విలువైన సమాచారం అందిందని తెలిపారు.
Read Also : Plane Crashes: కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు మృతి
Related News
Vikram Lander : జాబిల్లిపై మన ల్యాండర్ ఎలా ఉందో తెలుసా ..?
గత నెల 15న అంతరిక్షంలో తిరుగుతున్న ఓ ఉపగ్రహం సాయంతో సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసినట్లు తెలిపింది