HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >India Reports Over 600 Covid Deaths 103 In Maharashtra

Covid Deaths : ఆందోళ‌నక‌రంగా దేశంలో కోవిడ్ మ‌ర‌ణాలు

కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గిన తర్వాత కూడా దేశంలో కోవిడ్ -19 మరణాల రేటు పెరుగుతుండటంతో అధికారులు మరియు ప్రజలలో ఉద్రిక్తత పెరిగింది.

  • By CS Rao Published Date - 12:34 PM, Mon - 31 January 22
  • daily-hunt

కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గిన తర్వాత కూడా దేశంలో కోవిడ్ -19 మరణాల రేటు పెరుగుతుండటంతో అధికారులు మరియు ప్రజలలో ఉద్రిక్తత పెరిగింది. నివేదికల ప్రకారం, 24 గంటల్లో 2,34,281 మంది కరోనావైరస్ నవలకు పాజిటివ్ పరీక్షించారు మరియు కోవిడ్ -19 కారణంగా 893 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల వెనుక డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇంతకుముందు, మరణాల రేటు 400 కంటే తక్కువగా ఉంది, కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా 3 లక్షలకు పైగా నమోదయ్యాయి. కానీ, కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కానీ మరణాల రేటు పెరుగుతోంది మరియు ఇది ఆరోగ్య అధికారులలో ఉద్రిక్తతను రేకెత్తించింది.దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసి నేటితో (జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో 4కోట్ల మందిలో వైరస్‌ వెలుగు చూడగా.. 4లక్షల 94వేల మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. ఇంతటి ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులతో యావత్‌ దేశం పోరాటం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఓవైపు వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తూనే మరోవైపు కొవిడ్‌ నిబంధనలతో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కరోనాను నయం చేసే కచ్చితమైన చికిత్స మాత్రం ఇంకా అందుబాటులోకి రాకపోవడం నిరాశ కలిగించే విషయం.

భారత్‌లో జనవరి 30, 2020 తేదీన తొలి కరోనా కేసు నమోదయ్యింది. వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతోన్న ఓ భారత విద్యార్థినికి తొలుత పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేరళకు చెందిన ఆ యువతి సెమిస్టర్‌ సెలవుల్లో భారత్‌కు వచ్చిన సమయంలో వైరస్‌ వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో పలు దఫాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో దేశంలో మూడోవేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇలా కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తోన్న కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచ దేశాలు మరిన్ని వేవ్‌లను చవిచూస్తూనే ఉన్నాయి.కోవిడ్ మ‌ర‌ణాల‌పై అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. పాజిటివ్ రేటు త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ గ‌త 24 గంట‌ల్లో న‌మోదు అయిన మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. దేశంలో కోవిడ్ -19 మరణాల రేటు పెరుగుతుండటంతో అధికారులు మరియు ప్రజలలో ఉద్రిక్తత పెరిగింది. నివేదికల ప్రకారం, 24 గంటల్లో 2,34,281 మంది కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో 893 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల వెనుక డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇంతకుముందు, మరణాల రేటు 400 కంటే తక్కువగా ఉంది, కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా 3 లక్షలకు పైగా నమోదయ్యాయి. మరణాల రేటు పెరుగుతోంది. కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ గతేడాది నుంచి అందుబాటులోకి రావడంతో యావత్‌ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇప్పటివరకు పలు ఔషధాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నప్పటికీ కచ్చితమైన చికిత్స మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇటు భారత్‌లో కొవిడ్‌ విజృంభణ వేళ ఔషధాల వాడకం విపరీతంగా పెరగడం పట్ల నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆరోగ్యశాఖ సూచించిన ఔషధాలను మాత్రమే తగిన మోతాదులో వాడాలని సూచించిన ఆయన.. తీవ్ర లక్షణాలు ఉంటే తప్ప ఎక్కువ ఔషధాలు, స్టెరాయిడ్లు విరివిగా వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరించారు.

కొవిడ్‌-19 తీవ్రతను తగ్గించేందుకు ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివిర్‌, డీఆర్‌డీఓ తయారు చేసిన 2డీజీ ఔషధంతోపాటు ఇటీవల మోల్నూపిరవిర్‌ వంటి ఔషధాలతో ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ కొవిడ్‌ బాధితులు కోలుకునేందుకు ప్రత్యేకంగా కచ్చితమైన ఔషధం మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. మరోవైపు కొవిడ్‌ను నయం చేయడంలో యోగా, ధ్యానం వంటి వాటితోనూ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో ఒమిక్రాన్‌ రూపంలో మరో వేవ్‌ ముంచుకొచ్చింది. దీని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వ్యాక్సిన్‌, కొవిడ్‌ నిబంధనలను మాత్రమే కీలక ఆయుధాలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 95శాతానికిపైగా అర్హులకు వ్యాక్సిన్‌ ఒకడోసు అందగా.. 75శాతం అర్హులకు పూర్తి మోతాదులో పంపిణీ జరిగింది. వందశాతం అర్హులకు వ్యాక్సిన్‌ అందడమే లక్ష్యంతో వ్యాక్సిన్‌ అందించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ఇటీవలే ఉద్ఘాటించారు. కొత్త వేరియంట్ల దృష్ట్యా కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నవారికి ప్రికాషినరీ డోసు పేరుతో మూడో డోసును కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మరోవైపు చిన్నారులకు టీకా అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ, మ‌ర‌ణాల సంఖ్య నానాటికీ పెరుతుండ‌డంతో ఆందోళ‌న మొద‌లైయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Coronavirus
  • covid deaths

Related News

    Latest News

    • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

    • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

    • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

    • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

    • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd