COVID-19 Cases: కరోనా కేసులు మళ్లీ పైపైకి!
దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. గత నెలలో రెండు వేల లోపు కేసులు నమోదు కాగా..
- By Balu J Published Date - 01:06 PM, Wed - 8 June 22
దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. గత నెలలో రెండు వేల లోపు కేసులు నమోదు కాగా.. వైరస్ వ్యాప్తితో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్యులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 4 వేలకు సమీపంలోనే నమోదవుతోన్న రోజువారీ కేసులు.. తాజాగా 5 వేలకు పైగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 3,13,361 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 5,233 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతానికి ఎగబాకింది. దేశంలో కొత్త కేసులు 5 వేలు దాటడం 93 రోజుల తర్వాత ఇదే తొలిసారి. అంతకు ముందు రోజు(3,714 కేసులు) తో పోల్చితే కొత్త కేసుల్లో 41 శాతం పెరుగుదల కనిపించింది. రికవరీలు తక్కువగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 28,857 (0.07%) యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Related News
Heart Diseases: కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు.. అసలు కారణం ఇదేనట
Heart Diseases: కరోనా వైరస్తో బాధపడుతున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త భయాన్ని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి, కరోనా వైరస్ చూసిన చాలా మంది గుండెపోటు ప్రమాదాన్ని చూస్తున్నారు పెరుగుతున్న గుండెపోటు కేసులకు కరోనా మహమ్మారి కారణమని చెబుతున్న గణాంకాలు చెబుతున్నాయి.. ఎంత వరకు నిజమంటే 30 ఏళ్లలోపు వారిలో కూడా గుండెపోటు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. అంతే కాకుండా బడి పిల్లలు కూడా దీని నుం