HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >I Am Emotional First Time Pm Modis Message Ahead Of Ram Temple Event

Modi Emotional : తొలిసారి ఎమోషనల్ అవుతున్నా.. అయోధ్యలో 11 రోజుల పూజల ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ

Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది. 

  • By Pasha Published Date - 11:05 AM, Fri - 12 January 24
  • daily-hunt
Modi Emotional
Modi Emotional

Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది.  ఈనేపథ్యంలో రామమందిరంలో 11 రోజుల ప్రత్యేక పూజలను ఇవాళ  ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈమేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ శుభ సంద‌ర్భానికి సాక్షిగా ఉండ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. అయోధ్యలో రామ లల్లా ఆలయ శంకుస్థాపనకు ఇంకా 11 రోజుల సమయమే మిగిలి ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘ఈ మహా గొప్ప కార్యక్రమంలో భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ప్రభువు శ్రీరాముడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిరం ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని  ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక క్రతువును ప్రారంభిస్తున్నాను. ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను.  మొదటిసారిగా నేను ఎమోషనల్ అవుతున్నాను. ఇటువంటి పరిస్థితిలో నా భావాలను మాటలలో వ్యక్తీకరించడం చాలా కష్టం. అయినా నేను నా వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం  చేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Modi Emotional) చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రధాని నరేంద్ర మోదీ తన ఆడియో సందేశంలో ఇలా అన్నారు.. ‘‘ జీవితంలోని కొన్ని క్షణాలు దైవిక ఆశీర్వాదం వల్లే వాస్తవాలుగా మారుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఈరోజు చాలా పవిత్రమైన సందర్భం. ప్రతిచోటా శ్రీరాముని పట్ల అద్భుతమైన భక్తి వాతావరణం నెలకొని ఉంది. దేశంలోని ప్రతి ఒక్కరూ జనవరి 22 కోసం ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి అయోధ్యలో రామ్‌లల్లా దీక్షకు 11 రోజులే మిగిలాయి. నా జీవితంలో మొదటిసారిగా భావోద్వేగాలకు గురవుతున్నాను. నేను భక్తి యొక్క భిన్నమైన అనుభూతిని అనుభవిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ‘‘రామమందిర నిర్మాణం అనేది ఎన్నో తరాలు.. ఎన్నో ఏళ్లుగా రామభక్తులు తమ హృదయాల్లో ఉంచుకున్న కల. అది నెరవేరే సమయంలో నేను అక్కడ ఉండే అవకాశాన్ని పొందుతున్నాను’’ అని తెలిపారు. ‘‘భగవంతుడిని పూజించాలంటే మనలో దైవిక చైతన్యాన్ని మేల్కొల్పాలని మన గ్రంథాలలో చెప్పబడింది. దీని కోసం  ఉపవాసం, కఠినమైన నియమాలను పాటించాలి. ఆ ప్రకారం నేను  నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక క్రతువును అయోధ్యలో ప్రారంభిస్తున్నాను. ఈ పవిత్ర సందర్భంలో నేను భగవంతుని పాదాలను ప్రార్థిస్తున్నాను’’ అని మోడీ చెప్పారు.

Also Read: Free Electricity : తెలంగాణలో వారికి ఉచిత విద్యుత్ లేనట్టే.. ఎవరికి.. ఎందుకు ?

‘‘అయోధ్యలోని నాసిక్-ధామ్ పంచవటి నుంచి 11 రోజుల పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తుండటం నా అదృష్టం. పంచవటి అనేది రాముడు చాలా కాలం గడిపిన పుణ్యభూమి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి కూడా కావడం నాకు సంతోషకరమైన విషయం. వేల ఏళ్లుగా దాడికి గురవుతున్న భారతదేశ ఆత్మను కదిలించిన మహనీయుడు స్వామి వివేకానంద. నేడు అదే విశ్వాసం రామమందిరం రూపంలో మన గుర్తింపుగా అందరికీ కనిపిస్తుంది’’ అని ప్రధాని మోడీ తన ఆడియో సందేశంలో వివరించారు. ‘‘ఈ రోజు మాతా జీజాబాయి జయంతి. మాతా జీజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో గొప్ప వ్యక్తికి జన్మనిచ్చింది. మాతా జీజాబాయిని స్మరించుకుంటున్నప్పుడు సహజంగానే నాకు మా అమ్మ కూడా గుర్తుకు వస్తుంది. మా అమ్మ తన జీవిత చరమాంకం వరకు జపమాల జపిస్తూ సీత, రామ నామాలను జపిస్తూ ఉండేది. నమో యాప్ ద్వారా ప్రజలు తమ మాటలను, భావాలను నాకు తెలియజేయవచ్చు’’ అని ఆడియో సందేశంలో ప్రధాని మోడీ పేర్కొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayodhya Ram Mandir
  • modi emotional
  • pm modi
  • ram mandir
  • Ram Temple Event

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd