India’s Hunger Index: సోమాలియా సరసన భారత్ ఆకలి బాధ
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లోని భారత్ ర్యాంకును చూసి భారత ప్రభుత్వం తలదించుకోవాలి. పొరుగున ఉన్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఆకలి బాధను భారత్ అనుభవిస్తోంది.
- By CS Rao Published Date - 02:47 PM, Thu - 9 December 21
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లోని భారత్ ర్యాంకును చూసి భారత ప్రభుత్వం తలదించుకోవాలి. పొరుగున ఉన్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఆకలి బాధను భారత్ అనుభవిస్తోంది. మొత్తం 116 దేశాల ఆకలి బాధపై సర్వే చేయగా హంగర్ ఇండెక్స్ లో ఇండియా 101వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ , సోమాలియాతో సహా 15 దేశాల కంటే భారతదేశం కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటు. పోషకాహార విషయంలో భారత పరిస్థితిపై NFHS-5 సర్వే కూడా ఆందోళన పెంచుతోంది.
భారతదేశంలో 33 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చెబుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5), గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI), 2021తో పాటు ఇతర సర్వేలలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ దారుణంగా ఉంది. మొత్తం 33.23 లక్షలు (33,23,322) మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా, వాళ్లలో సగం మంది ప్రమాదకర స్థితిలో ఉన్నారట.
34 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సేకరించిన డేటా పోషకాహార ఫలితాల `పోషన్ ట్రాకర్` యాప్లో నమోదు చేశారు. నీతిఆయోగ్ రూపొందించిన ‘SDG ఇండియా ఇండెక్స్ & డ్యాష్బోర్డ్ 2020-21 పార్టనర్షిప్స్ ఇన్ ద డికేడ్ ఆఫ్ యాక్షన్’ ప్రకారం ఐదేళ్లలోపు వయస్సున్న 33.4 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారని తేల్చింది. 34.7 శాతం మంది మానసికంగా కుంగిపోతున్నారని నమోదు అయింది.
చైల్డ్ స్టంటింగ్లో దాదాపు మూడు శాతం క్షీణత – 38.4 (NFHS-4) నుండి 35.5 (NFHS-5)గా ఉంది. పిల్లల వృధా 1.7 శాతం క్షీణతను చూడగా, ఐదేళ్లలోపు పిల్లల్లో తీవ్రంగా వృధా అవుతున్న వారి శాతం 0.2 శాతం పెరిగింది. తక్కువ బరువు ఉన్న పిల్లల శాతం కూడా 3.7 శాతం తగ్గుదలని నివేదించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, అధిక బరువు ఉన్నవారు 2.1 శాతం (NFHS-4) నుండి 3.4 శాతానికి పెరిగింది, అంటే 1.3 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇలాంటి సూచకల ఆధారంగా భారతదేశ ప్రభుత్వం 5 కిలోగ్రాముల ఉచిత ఆహారధాన్యాల పథకాన్ని మార్చి 2022 వరకు పొడిగించింది.
జనాభాలో పోషకాహార లోపం ఉన్నవారి నిష్పత్తి 2000లో 18.4 శాతం నుండి 2021లో 15.3 శాతానికి తగ్గింది. అయితే, 2012తో పోల్చినప్పుడు 0.3 శాతం పెరగడం గమనార్హం. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2000లో 9.2 శాతంతో పోలిస్తే 3.4 శాతం తక్కువగా ఉంది. GHI నివేదిక ప్రకారం, పిల్లల పెరుగుదల (తక్కువ-ఎత్తు-వయస్సు) గణనీయంగా తగ్గినప్పటికీ 2000లో 54.2 శాతం నుండి 2020లో 34.7 శాతం ఉండడం సీరియస్ అంశం.
ఆకలి బాధ పెరుగుతోన్న భారత దేశం ఏనాడో మానవాభివృద్ధి ర్యాంకును మరిచిపోయింది. పేద, ధనికుల మధ్య అంతరం పెరిగిపోతోంది. ఇది సోమాలియా దేశంలో నెలకొన్న అసహనాన్ని గుర్తు చేస్తోంది. సోమాలియా తరహాలో ఆకలి కేకలు రాకముందే భారత్ దేశం మేల్కోవాలని కోరుకుందాం.
Tags
Related News
Lord Shiva: అరుణాచలం శివుడి ప్రత్యేకత ఎంటో తెలుసా.. చారిత్రక నేపథ్యం ఇదే
Lord Shiva: ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే అరుణాచలం ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది. పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు “మీ నుండి ఇంత �