HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Give Us Rs 1000 Too Prashant Kishors Appeal

Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-11-2025 - 5:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pk
Pk

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జన్ సురాజ్ పార్టీ మరో కొత్త ప్రణాళికను చేపట్టింది. బిహార్‌లోని ప్రతీ ఒక్కరు తమ పార్టీకి ఏడాదికి రూ.వెయ్యి ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బిహార్ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలోనే మరో యాత్ర చేయనున్నట్లు వెల్లడించిన ప్రశాంత్ కిషోర్.. డబ్బులు ఇవ్వని వారిని తాను ఈ యాత్రలో కలవనని స్పష్టం చేశారు. ఇక తన ఆస్తుల్లో 90 శాతాన్ని పార్టీ కోసం ఖర్చు చేయనున్నట్లు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా నితీష్ కేబినెట్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే జన్ సురాజ్ పార్టీని పెట్టి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు.. ఫలితాల్లో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒక్కరు కూడా విజయం సాధించకపోవడం.. జన్ సురాజ్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా.. వెనక్కి తగ్గకుండా.. పార్టీని బలోపేతం చేయాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి.. రానున్న రోజుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనేదానిపై ఒక పక్క ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ సంవత్సరం.. బిహార్ ప్రజలు తమ పార్టీకి రూ.1000 చొప్పున విరాళాలు ఇవ్వాలని కోరారు. జనవరిలో యాత్ర చేపడతానని.. విరాళాలు ఇచ్చిన వారినే ఈ యాత్రలో తాను కలుస్తానని తేల్చి చెప్పారు.

కొత్త ఏడాదిలో జనవరి 15వ తేదీ నుంచి బిహార్ నవనిర్మాణ్ సంకల్ప్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ యాత్రలో జన్ సూరాజ్ కార్యకర్తలు రాబోయే 15-18 నెలల్లో బిహార్‌లోని ప్రతీ ఇంటిని సందర్శించి.. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. తమ పార్టీకి మద్దతుగా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కేవలం రూ. వెయ్యి విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విరాళాలు ఇవ్వని వారిని తాను కలవబోనని కూడా స్పష్టం చేశారు.

అయితే తాను కూడా పార్టీ కోసం అన్ని రకాలుగా శ్రమిస్తానని.. ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో తాను సంపాదించే ఆదాయంలో 90 శాతం పార్టీ ప్రచార నిధులకే విరాళంగా ఇస్తానని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న తన ఇంటిని మినహాయించి.. గత 20 ఏళ్లుగా తాను సంపాదించిన ఆస్తులన్నీ పార్టీకే అంకితం చేస్తానని ప్రకటించారు.

పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం వద్ద.. ఒక రోజు మొత్తం మౌన దీక్ష నిర్వహించిన తర్వాత మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ఈ ఎన్నికల్లో తమ నైతిక బలాన్ని దెబ్బతీయాలని చూశారని.. తాము పోరాడి గెలుస్తామని.. ప్రభుత్వాన్ని మారుస్తామని మహాత్మా గాంధీని స్మరిస్తూ ప్రశాంత్ కిషోర్ తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించారు.

ఇక ఇటీవల నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రివర్గంపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ కొత్త కేబినెట్ అవినీతిపరులు, క్రిమినల్స్‌తో నిండిపోయిందని మండిపడ్డారు. ఈ మంత్రిమండలి.. బిహార్ ప్రజల ముఖంపై కొట్టినట్లయిందని.. అనేక మంది అవినీతిపరులైన నాయకులకు అవకాశం ఇవ్వడం గాయాలకు ఉప్పు రాసినట్లు ఉందని విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం నితీష్ కుమార్‌లకు బిహార్ రాష్ట్రం పట్ల కనీస ఆందోళన లేదని.. ఈ మంత్రివర్గాన్ని చూస్తుంటే స్పష్టం అవుతోందని ఆయన ఆరోపించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar assembly
  • Jan Suraaj Party
  • prashant kishor

Related News

    Latest News

    • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

    • IndiGo Flight Disruptions : ఇండిగో ప్యాసింజర్లకు రూ.10 వేల విలువైన వోచర్లు

    • AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

    • Akhanda 2 : ‘అఖండ-2’ కు మరో దెబ్బ..బాలయ్య కు ఎవరి దిష్టి తగిలిందో..?

    • IND vs SA: రెండో టీ20లో ఎవ‌రు గెలుస్తారు? టీమిండియా జోరు చూపుతుందా!

    Trending News

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

      • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd