Shiv Sena: ఉద్దవ్ వర్గానికి షాక్… షిండే వర్గానికే విల్లు బాణం గుర్తు
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన పార్టీ పై పట్టు కోల్పోయి అధికారం చేజార్చుకున్న ఉద్దవ్ థాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది.
- By Naresh Kumar Published Date - 09:00 PM, Fri - 17 February 23
Shiv Sena Symbol: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన పార్టీ పై పట్టు కోల్పోయి అధికారం చేజార్చుకున్న ఉద్దవ్ థాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. చీలిక వర్గమైన ఏక్నాథ్ షిండే వర్గానిదే శివసేన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. విల్లు బాణం గుర్తు షిండే వర్గానికే చెందుతుందని తెలిపింది. ఒక రకంగా ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఇది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. దాదాపు 56 ఏళ్లుగా పార్టీని నడుపుతున్న థాక్రే కుటుంబం ఇలా పార్టీని కూడా కోల్పోవడం ఎవ్వరూ ఊహించ లేదు.
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి కూటమిని వ్యతిరేకిస్తూ 2022 జూన్ నెలలో కొందరు ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే బయటికి వచ్చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టి..బీజేపీ సహాయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం నడుస్తోంది. అప్పటి నుంచి శివసేన పార్టీ గుర్తింపు కోసం థాక్రే వర్గం, షిండే వర్గం న్యాయపోరాటానికి దిగాయి. గత 8 నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు కేంద్ర ఎన్నికల కమీషన్ తెరదించింది. పార్టీ గుర్తు షిండే వర్గానికే కేటాయిస్తూ ప్రకటన చేసింది.
కాగా ఎన్నికల సంఘం నిర్ణయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేననీ, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఉనికిని నిర్ణయిస్తే..ఎవరైనా సరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎం అవుతారని మండిపడ్డారు. ఏక్నాథ్ షిండే వర్గం విల్లు బాణం గుర్తును దొంగిలించిందని..ప్రజలే దీనికి ప్రతీకారం చెబుతారని థాక్రే తెలిపారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Related News
Uddhav Thackeray: అధికారం నుంచి బీజేపీని తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి : ఉద్ధవ్
Uddhav Thackeray: శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే బిజెపి నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారిని “పోకిరి” అని పిలిచారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా బ్లాక్ నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో మహా ర్యాలీ’ (సేవ్ డెమోక్రసీ ర్యాలీ)లో ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల సమస్యపై బిజెపిపై దాడి చేసిన ఆయన, దానిని “భ్రష్ట (అవినీతి) జనతా పార్టీ”