Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?
- By Sudheer Published Date - 11:27 AM, Mon - 22 January 24
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే యావత్ ప్రజలు , భక్తులు అయోధ్య కు సంబదించిన విశేషాలు , బాల రాముడు గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నో విశేషాలు బయటకు వస్తున్న..ఇంకా ఎన్నో తెలుసుకోవాలని భక్తులు ఆత్రుత కనపరుస్తూ సెర్చ్ చేస్తున్నారు. అయితే వీటిలో బాల రాముడు చిన్న వయసులో ఏంచేసాడో కూడా తెలుసుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని చిలిపి పనులు బయటకు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
చిన్న తనంలో బలరాముడు చేసిన చిలిపి , అల్లరి పనులు అన్ని ఇన్ని కావంటున్నారు. చిన్ని రాముడు అందరి కన్నా ముందు కేరింతలు కొడుతూ.. బోర్లా పడటం..మెల్లిగా పట్టుకుని నిలుచోవడం.. బుజ్జి బుజ్జి అడుగులు వేయడం.. మెల్లిగా నడవడం..ఇలా ఎన్నో చేసాడట. ఓ రోజు బాల రాముడు రాజ భవనంలో ఆడుకుంటూ ఉండగా.. చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది..అది పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు.. అదే కాకుండా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ వస్తువులతో ఆడుకుంటున్న ఈ బాల రాముడు అన్నీ విడిచి పెట్టి.. నాకు ఆ చందమామ కావాలని మారం చేసాడట. ఎంతమంది నచ్చజెప్పాలని ట్రై చేసిన మొండి పట్టిన రాముడు ఎవరి మాటలు వినలేదట.
ఆకాశంలో ఉన్న చందమామని నేల మీదకు తీసుకురావడం అసాధ్యం అని చెప్పడంతో .. బాల రాముడికి నచ్చలేదు.. నాకు ఆ చందమామే కావాలంటూ గట్టి గట్టిగా ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్లా కాలేదు.. ఇంతలో ఒకరు ఒక బంగారు పళ్ళెంలో నీళ్ళు పోసి అతని ముందు పెట్టారు.. ఆ నీటిలో చంద్రుడు ప్రతిబింబం కనిపించడంతో.. అది చూసిన బాల రాముడు సంతోషంతో.. ఆ చందమామతో ఆటలు ఆడేవాడట..ఇలా ఎన్నో బాల రాముడు చేసాడని చెపుతున్నారు.
Read Also : Ram Mandir Inauguration : రామ మందిరం ప్రారంభంలో ఆ 84 సెకన్లే కీలకం..
Tags
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.