Rahul Gandhi: తుఫాన్ బాధితులను ఆదుకోండి: కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
దేశంలో తుఫాన్ తో ప్రజలు అనేక అవస్థలుపడుతున్నారు. ఈ పరిస్థితిపై రాహుల్ గాంధీ నిరాశకు గురయ్యారు.
- By Balu J Published Date - 11:45 AM, Tue - 5 December 23
![Rahul Gandhi: తుఫాన్ బాధితులను ఆదుకోండి: కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/LOGO-2023-09-24T101545.873.jpg)
Rahul Gandhi: మిచౌంగ్ తుఫాను తమిళనాడులో విధ్వంసం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై నగరం భారీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు, ఇల్లు జలయమం కావడంతో ప్రజలు అనేక అవస్థలుపడుతున్నారు. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
“తమిళనాడులో మైచాంగ్ తుఫాను కారణంగా సంభవించిన విధ్వంసం, మరణాల వార్తలతో బాధపడ్డాను. వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. తుఫాను కారణంగా ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాధితులకు అండగా ఉండాలని కోరుతున్నాను.
తమ ప్రభుత్వ సహాయ, సహాయ చర్యలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం’’ అని గాంధీ అన్నారు. ఈ అత్యవసర సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుండి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందుకోవాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
Also Read: Rashmika Mandanna: యానిమల్ సక్సెస్ తో రష్మికకు బాలీవుడ్ ఆఫర్లు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Rahul Gandhi : రాహుల్ గాంధీతో రైతు సంఘాల నేతలు భేటి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/Leaders-of-farmers-associat.jpg)
Rahul Gandhi : రాహుల్ గాంధీతో రైతు సంఘాల నేతలు భేటి
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతుల రాహుల్ గాంధీతో భేటి అయ్యారు.