Bharat Jodo Nyay Yatra : భారత్ న్యాయ్ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- By Sudheer Published Date - 11:17 PM, Mon - 5 February 24
రాంచీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచి అమలు చేస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికలకు సిద్దమవుతున్న తీరును రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
Read Also : MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా
Related News
Talasani: కేసీఆర్ నాయకత్వంలోనే ఊహించనివిధంగా తెలంగాణ అభివృద్ధి: తలసాని
Talasani: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా శుక్రవారం రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల జబ్బార్ కాంప్లెక్స్ వద్ద జరిగిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ఆ�