Centre On Omicron: ఓమిక్రాన్ పై మోదీ సమీక్ష
దేశంలో ఇప్పుడు ఓమిక్రాన్ హాట్ టాపిక్ అయ్యింది. సూపర్ స్ప్రెడర్ గా భావిస్తోన్న ఈ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం అవుతోంది. ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
- By Siddartha Kallepelly Published Date - 11:34 PM, Thu - 23 December 21
దేశంలో ఇప్పుడు ఓమిక్రాన్ హాట్ టాపిక్ అయ్యింది. సూపర్ స్ప్రెడర్ గా భావిస్తోన్న ఈ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం అవుతోంది. ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, కేరళలో ఓమిక్రాన్ కేసుల తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంది. పలు రాష్ట్రాలు ముందస్తు చర్యల్లో భాగంగా ఆంక్షలబాట పడుతున్నారు.
దేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు హాజరయ్యారు. దేశంలో ఓమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు కాంటాక్ట్లను ట్రేసింగ్ చేయాలని మోదీ అధికారులకు సూచించారు.
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపుతామని, ఓమిక్రాన్ నియంత్రణకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్లస్టర్లు ఏర్పాటుచేసి కొత్త వేరియంట్ ను నియంత్రించాలని ప్రధాని కోరారు.
న్యూ ఈయర్ వేడుకల నేపధ్యంలో మాస్ గ్యాదరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలపై ఆంక్షలు విధించాలని కేంద్రం భావిస్తోంది. ఓమిక్రాన్ కేసుల కట్టడికి కంటైన్మెంట్, బఫర్ జోన్లను గుర్తించడంతోపాటు, వ్యాక్సినేషన్నూ త్వరగా పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలంటూ కేంద్రం కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది.
Related News
Amit Shah: కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం : అమిత్ షా
Amit Shah: పార్లమెంటులో మెజారిటీ సాధించడానికి అవసరమైన సీట్లను ఇప్పటికే ఎన్డీయే సాధించిందని, కేంద్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి మంగళవారం చెప్పారు. ఇప్పటికే 270 సీట్లు సాధించి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యేలా చేశామన్నారు. ఐదో దశ నుంచి 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటాం’ అని పార్టీ అభ్యర్థి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరికి మద్దతుగా హౌరా జిల్లాలోని ఉల�