HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Central Government Gives Y Plus Security To Fifteen Mlas In Sinde Group In Maharastra

Shiv Sena rebels: మహారాష్ట్రలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు.

  • By Hashtag U Published Date - 04:27 PM, Sun - 26 June 22
  • daily-hunt
Shiv Sena Shinde
Shiv Sena Shinde

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం.. సీఆర్పీఎఫ్ వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. దీనివల్ల వారితోపాటు వారి కుటుంబాలకు కూడా రక్షణ లభిస్తుంది. వైప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తే.. దానికోసం 39 మంది సిబ్బంది పహారా కాస్తారు. ఇద్దరు నుంచి నలుగురు కమాండోలతోపాటు 11 మంది పోలీసులు సెక్యూరిటీని ఇస్తారు. ఇలా మూడు షిప్టుల్లోనూ కాపలా ఉంటారు. 2 నుంచి 3 వాహనాలను కూడా సమకూరుస్తారు.

అటు శివసేనను చీల్చడానికి ప్రయత్నించిన ఏక్ నాథ్ షిండే టీమ్ లోని సుమారు 20 మంది ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ థాకరేతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం.. వారు బీజేపీలో విలీనమవ్వడానికి ఇష్టపడకపోవడమే. పైగా అసమ్మతి ఎమ్మెల్యేలపై ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతోంది. శివసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరా ప్రదర్శనకు దిగారు. దీనికి పోటీగా అటు షిండేకు మద్దతు తెలిపేవారు ఠాణేలో నిరసనలకు దిగారు.

షిండేతోపాటు ఇతర రెబల్ మంత్రులపై చర్యలు తీసుకోవడానికి శివసేన యోచిస్తోంది. దీనివల్ల షిండే గ్రూప్ లో ఉన్న షిండే, గులాబ్ రావు పాటిల్, దాదా భూసే వంటి మంత్రులు తమ శాఖలను కోల్పోతారు. వారితోపాటు సహాయమంత్రులపైనా చర్యలు తప్పేలా లేవు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండేను ఆ పదవి నుంచి తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కాని దానిపై న్యాయసలహా తీసుకున్న తరువాతే కోర్టుకు వెళ్లాలని షిండే వర్గం ఆలోచిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Shiv Sena (Balasaheb)
  • shiv sena rebels
  • y category security

Related News

    Latest News

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

    • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd