PM Modi : మోడీ రెండో టర్మ్ మూడో వార్షికోత్సవానికి రెడీ
ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ సిద్ధం అవుతోంది.
- By Hashtag U Published Date - 02:48 PM, Tue - 26 April 22
ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ సిద్ధం అవుతోంది. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ఢిల్లీలో సమావేశం అయింది. కమిటీలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ మరియు రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, సి.టి. రవి మరియు డి. పురందరేశ్వరి, రాజ్యసభ సభ్యులు అనిల్ బలూని, వినయ్ సహస్రబుద్ధే , లోక్సభ సభ్యురాలు అపరాజిత సారంగి తదితరులు ఉన్నారు.
2020లో విజృంభించిన COVID-19 కారణంగా మొదటి రెండు వార్షికోత్సవాలను సాదాసీదాగా బీజేపీ ముగించింది. పబ్లిక్ ఈవెంట్ను మినహాయించింది.ఈసారి ప్రభుత్వం సాధించిన వివిధ విజయాలను హైలైట్ చేయడానికి రాబోయే రోజుల్లో కార్యక్రమాలు మరియు కార్యకలాపాల జాబితాను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మోడీ రెండవ టర్మ్ లో అనేక పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో ఆర్టికల్ 370 రద్దు, సుప్రీంకోర్టు తీర్పు, అనేక అసెంబ్లీ ఎన్నికల విజయాలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం హైలైట్ కానున్నాయి.
ఇటీవలి కాలంలో కోవిడ్-19 సంఖ్యలు పెరిగినప్పటికీ, అనేక రాష్ట్రాల్లో, ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడం వలన, ప్రభుత్వం ఎనిమిదవ వార్షికోత్సవాన్ని మోడీ మొదటి టర్మ్తో సహా అనేక గొప్ప నిర్ణయాలను చెబుతూ ప్రజలకు ఆశలను పెంచేలా పాలక పక్షం ప్లాన్ చేస్తోంది.
Related News
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.