PM Modi: దేశభాషలను భారతీయ ఆత్మగా బీజేపీ పరిగణిస్తుంది..ప్రధాని కీలక వ్యాఖ్యలు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాంతీయ భాషలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీ అన్ని భారతీయ భాషలను దేశ ఆత్మగానే పరిగణిస్తుందన్నారు.
- By Hashtag U Published Date - 05:00 AM, Sat - 21 May 22
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాంతీయ భాషలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీ అన్ని భారతీయ భాషలను దేశ ఆత్మగానే పరిగణిస్తుందన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ బేరర్ల సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. భారతదేశ సాంస్క్రుతిక, భాషా వైవిద్యాన్ని జాతీయ గౌరవంతో బీజేపీ ముడిపెట్టిందన్నారు. జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం కల్పించడం ప్రాంతీయ భాషల పట్ల తమ నిబద్దతును చూపిస్తుందని చెప్పారు. దేశాభాషలను భారతీయ ఆత్మగా బీజేపీ పరిగణిస్తుందని చెప్పారు. దేశ అత్యున్నత భవిష్యత్తుకు అనుసంధానం చేస్తుందన్నారు. ఈ మధ్యకాలంలో భాషా ప్రాతిపదికన కొత్త విధానాల పట్ల నిరంతరం దేశప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ప్రధాని. బీజేపీ ప్రతి భారతీయ భాషను గౌరవిస్తుందని ప్రధాని నొక్కి చెప్పారు.
సంక్షేమ పథకాలు అందని పేదలు,అర్హులైన లబ్దిదారులు ఎవరు లేరని నిర్దారించాలని బీజేపీ కార్యకర్తలను కోరారు ప్రధాని. దీనికోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ భాజాపా, హర్ గరీబ్ కా కల్యాణ్ అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు. దీనిని ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం కల్పించాలన్నారు.
మరోవైపు చిన్న చిన్న సంఘటనలను తమ స్వార్థ ప్రయోజనాలకు కోసం వినియోగించుకుంటున్న ప్రతిపక్షాలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు దేశాన్ని ప్రధాన సమస్యల నుంచి నాశనం చేద్దామని చూశాయని…కానీ మేము వాటి వలలో చెక్కులేదన్నారు. అభివ్రుద్ధి అంశాల నుంచి మిమ్మల్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని…వాటికే కట్టుబడి ఉండాలన్నారు. కుటుంబ పార్టీలపై పోరు కొనసాగించాల్సిందేనని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
Related News
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.