Block Congress: జోడో యాత్రకు కోర్టు షాక్.. ట్విట్టర్ అకౌంట్స్ బ్లాక్..?
కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రచారానికి
- By Gopichand Published Date - 11:47 PM, Mon - 7 November 22

కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రచారానికి సంబంధించిన హ్యాండిల్స్ను తాత్కాలికంగా నిరోధించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు బెంగళూరు కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వీడియోలలో ఒకదానికి సూపర్ హిట్ చిత్రం KGF-2 పాటలను కాంగ్రెస్ ఉపయోగించుకుందని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన MRT మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
హిందీలో KGF-2 పాటల హక్కులను పొందేందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సంగీత సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. రాహుల్ జోడోయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్స్ను బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్ ను ఆదేశించింది. కాగా భారత్ జోడో యాత్ర కోసం రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన MRT మ్యూజిక్ సంస్థ రాహుల్ గాంధీతో సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ సోమవారం తీర్పు వెలువరించింది.
ఈ క్రమంలో రెండు హ్యాండిళ్ల నుంచి మూడు లింక్లను తీసివేయాలని ట్విట్టర్ను కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్స్ను బ్లాక్ చేయాలని ఆదేశించింది. కాపీరైట్లను ఉల్లంఘించినందుకు గాను ముగ్గురు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్, సుప్రియా శ్రీనాట్లపై కూడా MRT మ్యూజిక్ కేసు దాఖలు చేసింది. “INC & BJY SM హ్యాండిల్స్కు వ్యతిరేకంగా బెంగుళూరు కోర్టు నుండి వచ్చిన ప్రతికూల ఉత్తర్వు గురించి మేము సోషల్ మీడియాలో చదివాము. మాకు తెలియజేయబడలేదు. కోర్టు విచారణకు హాజరు కాలేదు. ఆర్డర్ కాపీ అందలేదు. మేము అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తున్నాము’ అని కాంగ్రెస్ ట్వీట్లో పేర్కొంది.
https://twitter.com/i/status/1579838167217188865