Ram Lalla With BrahMos : బ్రహ్మోస్ క్షిపణితో అయోధ్య రాముడు.. రిపబ్లిక్ డేలో స్పెషల్ శకటాలు
Ram Lalla With BrahMos : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో పరేడ్, శకటాల ప్రదర్శనలు కనులవిందుగా జరిగాయి.
- By Pasha Published Date - 01:31 PM, Fri - 26 January 24
Ram Lalla With BrahMos : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో పరేడ్, శకటాల ప్రదర్శనలు కనులవిందుగా జరిగాయి. వివిధ రాష్ట్రాలు వాటి సంప్రదాయాలు, సంస్కృతిని అద్దంపట్టే శకటాలను ఈసందర్భంగా ప్రదర్శించాయి. జనవరి 26 ప్రసంగంలో అయోధ్య రామమందిరం అంశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ సర్కారు రిపబ్లిక్ డే శకటాల్లోనూ అయోధ్య రామమందిరాన్ని డిస్ప్లే చేసింది. వాహనంపై బ్రహ్మోస్ క్షిపణితో నిలబడిన బాలరాముడి మూర్తితో కూడిన శకటం అందరినీ ఆకట్టుకుంది. అందరికీ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించింది. ‘‘అయోధ్య: వికసిత్ సమ్రాధ్ విరాసత్’’ అనే థీమ్తో ఉత్తరప్రదేశ్ సర్కారు ఈ శకటాన్ని(Ram Lalla With BrahMos) ప్రదర్శించింది.
#WATCH | The #RepublicDay2024 tableau of Uttar Pradesh takes part in the parade.
The theme of the tableau is based on 'Ayodhya: Viksit Bharat-Samradh Virasat'. The front of the tableau symbolises the Pranpratishtha ceremony of Ram Lalla, showcasing his childhood form. pic.twitter.com/VHdsaiVMvo
— ANI (@ANI) January 26, 2024
ఇక ఇప్పటివరకు హింసాకాండతో అట్టుడికిన మణిపూర్ సర్కారు ‘నారీ శక్తి’ నినాదంతో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంలో మణిపూర్ కల్చర్ను అద్దంపట్టే ప్రదర్శన ఇచ్చిన మహిళలంతా.. ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్లోని ‘ఇమా కీథెల్’ వాణిజ్య సముదాయంలో స్టాల్స్ నడుపుకునే వారే కావడం విశేషం. కేవలం మహిళలే షాపులు నిర్వహించే ‘ఇమా కీథెల్’ వాణిజ్య సముదాయానికి దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది.
#WATCH | Manipur showcases its 'Nari Shakti' with 'Ima Keithel', the 500-year-old market, one and only in the world run entirely by women#RepublicDay2024 pic.twitter.com/tTYJ1AYkiN
— ANI (@ANI) January 26, 2024
We’re now on WhatsApp. Click to Join.
కర్తవ్య పథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లో ఫ్రాన్స్కి చెందిన బ్యాండ్ కూడా పాల్గొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఈసారి రిపబ్లిక్ డేకు భారత అతిథిగా వచ్చినందున.. ఆ దేశానికి చెందిన బ్యాండ్ సైతం వేడుకలకు హాజరైంది. ఇక రెజిమెంట్ పరేడ్ కూడా కనులవిందుగా సాగింది. ఈ పరేడ్లో భారత సైన్యం ఆయుధ సంపత్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో మల్టీ ఫంక్షన్ రాడార్ సిస్టం, డ్రోన్ జామర్ సిస్టం, వెపన్ లొకేటింగ్ రాడార్ సిస్టం, పినాకా యుద్ధ ట్యాంకర్లు, బీఎంపీ 2/2కే ట్యాంకులు, నాగా మిస్సైల్స్ సిస్టం, ట్యాంక్ టీ 90, 61 అశ్విక దళం ఉన్నాయి.
ఆగస్టు 15, జనవరి 26 పతాకావిష్కరణ వేడుకల్లో తేడా ఇదీ
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం.
- ఆగస్ట్ 15న జెండాను కింది నుంచి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది.
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.