Anant Ambani : అనంత్ అంబానీ పాదయాత్ర ..అంత అవసరం ఏంటి..?
Anant Ambani : ఆయన ధార్మిక భావనతో ఈ యాత్ర చేపట్టారని, ద్వారకనాథుని దర్శనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం
- By Sudheer Published Date - 12:08 PM, Tue - 1 April 25

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గుజరాత్లోని జామ్నగర్ (Jamnagar (Gujarat)) నుంచి ద్వారక (Dwarka) వరకు కాలినడకన పాదయాత్ర చేస్తున్నాడు. ఈ రెండు నగరాల మధ్య దూరం 140 కిలోమీటర్లు ఉండగా, అనంత్ రోజుకు సుమారు 20 కిలోమీటర్లు నడుస్తున్నట్లు సమాచారం. ఆయన ధార్మిక భావనతో ఈ యాత్ర చేపట్టారని, ద్వారకనాథుని దర్శనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
Hyderabad : విదేశీ యువతిపై లైంగిక దాడి
అనంత్ అంబానీ ఈ ప్రయాణాన్ని రాత్రి వేళల్లో కొనసాగిస్తున్నారు. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు భారీ భద్రత నడుమ రాత్రిపూట నడక సాగిస్తున్నారు. భక్తి మార్గంలో నడిచే ఈ యాత్ర ద్వారా ఆయన విశేషమైన భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా నడకను ప్రతిరోజూ నియమంగా చేసుకున్నారని, ఇది ధార్మికతతో పాటు ఫిట్నెస్ను మెరుగుపరచే లక్ష్యంగా కూడా ఉందని అంటున్నారు.
Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?
ఈ యాత్రను ఏప్రిల్ 10న తన పుట్టినరోజు నాటికి పూర్తి చేయాలని అనంత్ భావిస్తున్నారు. ద్వారక చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ధార్మిక విశ్వాసాలు, ఆధ్యాత్మిక చింతనలో ఆయన మునిగిపోయినట్లు అనిపిస్తోందని, ఈ యాత్ర అనంత్ అంబానీ భక్తిభావాన్ని స్పష్టం చేస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.