Owaisi Attack : జడ్ ప్లస్ ప్లీజ్
జడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరాడు.
- By CS Rao Published Date - 03:26 PM, Mon - 7 February 22
జడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరాడు. పార్లమెంట్లో అసరుద్దీన్ పై జరిగిన హత్యయత్నంపై షా వివరాలు ఇచ్చాడు. ఆ రోజున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కార్కేడ్ వద్ద కాల్పులు జరిపారని వివరించాడు. వాహనానికి దిగువన మూడు బుల్లెట్లు దిగిన గుర్తులు ఉన్నాయని సాక్షులు చెప్పినట్టు తెలిపాడు. ఎఫ్ ఐఆర్ ను నమోదు చేసిన కేసు ను విచారిస్తున్నామని పార్లమెంట్లో వేసిన వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. తన కదలికపై ఓవైసీ జిల్లా కంట్రోల్ రూమ్కు ఎలాంటి సమాచారం పంపలేదని షా తెలిపాడు. అసదుద్దీన్ ఒవైసీకి హాపూర్ జిల్లాలో ఎటువంటి ముందస్తు షెడ్యూల్ జరగలేదని, జిల్లా కంట్రోల్ రూమ్కు ఎటువంటి సమాచారం పంపకపోవడంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. సంఘటన తరువాత పోలీసుల సంరక్షణలో క్షేమంగా ఢిల్లీ చేరుకున్నారని రాజ్యసభలో అమిత్ షా వివరించాడు.
జెడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీని అమిత్ షా రాజ్యసభ సాక్షిగా కోరాడు. హత్యయత్నం జరిగిన రోజున ఓవైసీకి కేంద్రం జడ్ ప్లస్ ను ఆఫర్ చేసింది. కానీ, ఆయన తిరస్కరించిన విషయం విదితమే. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం మాత్రం చాలంటూ కేంద్రానికి ఓవైసీ తెలియచేశాడు. ఇప్పుడు షా మాట ప్రకారం జడ్ ప్లస్ తీసుకుంటారా? లేదా అనేది చూడాలి.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం