Missile Drones In Border : మిస్సైల్స్ ప్రయోగించగల డ్రోన్స్.. బార్డర్ లో భారత్ మోహరింపు
Missile Drones In Border : బార్డర్ లో భద్రతను పెంచడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
- By Pasha Published Date - 01:42 PM, Sun - 13 August 23
Missile Drones In Border : బార్డర్ లో భద్రతను పెంచడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నాలుగు రోజుల క్రితమే కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న ఎయిర్ బేస్ లో మిగ్ 29 యుద్ధ విమానాలను మోహరించిన ఆర్మీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన నాలుగు కొత్త హెరాన్ మార్క్-2 డ్రోన్లను చైనా, పాకిస్తాన్ల సరిహద్దులలో మోహరించింది. ఈ డ్రోన్స్ కు మిస్సైల్స్, ఇతర ఆయుధాలను ప్రయోగించే సామర్ధ్యం కూడా ఉంది. ఇండియా బార్డర్ లోని నార్త్ సెక్టార్లో ఉన్న ఫార్వర్డ్ ఎయిర్ బేస్లో వీటిని రంగంలోకి దింపారు.
Also read : Apple Feature In Android : త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి యాపిల్ ఫోన్ ఫీచర్ !
హెరాన్ మార్క్-2 డ్రోన్స్ గురించి..
- హెరాన్ మార్క్-2 డ్రోన్స్ లో శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది.
- ఇవి దాదాపు 36 గంటల పాటు విరామం లేకుండా నిఘా వ్యవహారాల్లో పనిచేయగలవు.
- యుద్ధ విమానాలకు హెల్పర్ గా కూడా ఇవి పనిచేస్తాయి.
- లేజర్ లైట్ సహాయంతో యుద్ధ విమానాలకు శత్రు లక్ష్యాలను చూపించి.. దాడులు కచ్చితంగా చేసేందుకు హెరాన్ మార్క్-2 డ్రోన్స్ సహకరిస్తాయి.
- ప్రాజెక్ట్ చీతా అమలులోనూ భారత వైమానిక దళం సహకరిస్తోంది. చీతాల కదలికలను ట్రాక్ చేసే విషయంలోనూ హెరాన్ డ్రోన్ల(Missile Drones In Border) సహకారాన్ని తీసుకుంటున్నారు.
- త్వరలో అమెరికా నుంచి మన దేశానికి 31 ప్రిడేటర్ డ్రోన్లు కూడా అందబోతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే.. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పెద్ద ఏరియాలలో నిఘాను పెంచేందుకు నౌకాదళానికి చేదోడుగా ఉంటాయి.
Also read : World Organ Donation Day: నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే..?
Tags
Related News
Maldives: టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసిన మాల్దీవులు..!
మాల్దీవులు (Maldives).. టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసి దేశంలోని సముద్రతీర ప్రాంతంలో గస్తీ నిర్వహించింది.