Chhattisgarh: యువతిని చంపి…కారు ఢిక్కీ లో కుక్కి 4 రోజుల పాటు…!!
- By hashtagu Published Date - 10:07 AM, Mon - 21 November 22
ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. బిలాస్ పూర్ లో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. శవాన్నికారు డిక్కీలో కుక్కి నాలుగు రోజులపాటు అలాగే ఉంచాడు. ఆదివారం కారులో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మ్రుతురాలితోపాటు ఆ వ్యక్తి బిలాస్ పూర్ లోని తిక్రపరా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్నారు. వీరు స్టార్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెటినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా నష్టాలు రావడతో ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి. డబ్బుల కోసం యువతి ఒత్తిడి తెస్తోందని…పట్టణంలోని దయాల్ బంద్ ప్రాంతంలో గొంతకోసి హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. అనంతరం శవాన్ని కారులోనే ఉంచి కస్తూర్భా నగర్ లోని తన ఇంటికి తీసుకువచ్చాడు.
4రోజుల తర్వాత కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారు లోనుంచి శవాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపలోకి తీసుకున్నారు. అయితే ఇతర కోణాల్లో నుంచి కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Tags
Related News
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.