Man On Pole : రైల్వే విద్యుత్ టవర్ ఎక్కేశాడు.. రెండు గంటలు ట్రైన్లు ఆపేశాడు
Man On Pole : మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.
- By Pasha Published Date - 06:27 PM, Tue - 28 November 23
Man On Pole : మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే స్టేషన్లోకి వచ్చి.. ఏకంగా రైల్వే ట్రాక్పై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్ల టవర్పైకి ఎక్కాడు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సప్లైను ఆపేశారు. దీతో ఆ వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది వెళ్లి.. ఎంత చెప్పినా ఆ పిచ్చి వ్యక్తి వినిపించుకోలేదు. విద్యుత్ టవర్ పైనుంచి దిగడానికి ససేమిరా అన్నాడు. చివరకు రైల్వే సిబ్బంది ఎలాగోలా నచ్చజెప్పి.. నిచ్చెన సాయంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని కిందికి దింపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటన మహారాష్ట్రలోని నందూర్బార్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కరెంట్ స్తంభం నుంచి దింపిన తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇక అతగాడు చేసిన హల్చల్ కారణంగా రైల్వే స్టేషన్లో గంటపాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో భుసావల్ – సూరత్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత రైల్వే సేవలు తిరిగి(Man On Pole) మొదలయ్యాయి.
Also Read: WhatsApp Update : వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఒకే వాట్సాప్ లో రెండు అకౌంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చట?
Related News
Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!
Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికుల�