HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >A Bomb Threat Has Been Made Against The Vande Bharat Train

వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2026 - 10:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
vande bharat trains bomb threat
vande bharat trains bomb threat

Bomb Threat  వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు.

  • వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు
  • హైదరాబాద్‌లో జిహాదీ బృందం కుట్ర
  • రైల్వే జీఎంకు అగంతకుడి లేఖ

వందేభారత్ ట్రైన్లను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ రైల్వే వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 3వ తేదీన ఒక అజ్ఞాత వ్యక్తి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి పోస్టు ద్వారా ఈ లేఖను పంపాడు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న నలుగురు జిహాదీ బృందం సభ్యులు వందేభారత్ వెళ్లే రైల్వే ట్రాక్‌లపై బాంబులు అమర్చినట్లు లేఖలో పేర్కొన్నాడు. సుమారు 250 మంది ప్రయాణికులను హతమార్చాలని ఆ టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో వెల్లడించారు. లేఖలో సదరు అగంతకుడు ఆ నలుగురు జిహాదీ టెర్రరిస్టుల పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం.

ఈ బెదిరింపు లేఖతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం (RPF), పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా వందేభారత్ ట్రైన్లు, అన్ని రైల్వే స్టేషన్లు, ట్రైన్ ట్రాకుల వెంట బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు విస్తృతం చేశారు. ఇది నిజంగానే ఉగ్రవాద కుట్రనా? లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని చేసిన పనా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే అధికారులు ఇప్పటికే గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ట్రైన్లలో కానీ.. స్టేషన్లలో గానీ ఏవైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని వెంటనే 139 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని రైల్వే అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు.

ఇక ఇ లెటర్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రాథమిక బాధ్యత అని.. ఎవరికీ ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గతంలోనూ ట్రైన్లకు ఆకతాయిలు ఇలాంటి బెదిరింపు లెటర్లు పంపారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే లెటర్ పంపిన ఆగంతకుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bomb threat
  • hyderabad
  • Indian Railway Alert
  • telangana news
  • vande bharat trains

Related News

kurchi-thatha-dies-of-heart-attack

Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.

  • Union Minister Bandi Sanjay's mother falls critically ill.

    Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత

  • Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

    Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

Latest News

  • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

  • Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

  • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

  • kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd