Stroke: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే స్ట్రోక్ ముప్పు ఉన్నట్టే?
మెదడులో ఏదైనా భాగానికి రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా
- By Nakshatra Published Date - 04:12 PM, Sun - 9 April 23
మెదడులో ఏదైనా భాగానికి రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెదడులో ఏ భాగం ప్రభావితం అయిందన్న దాని ఆధారంగా కొన్ని అవయవాలు పని చేయకుండా పోవచ్చు. మెదడులో రక్త నాళాలు చిట్లి రక్తస్రావం అయినప్పుడు కూడా స్ట్రోక్ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. రక్తస్రావం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డు పడుతుంది. దీనివల్ల మెదడు దెబ్బతింటుంది. కొన్ని సార్లు స్ట్రోక్ తీవ్రంగా ఉంటే కోమాలోకి వెళ్లడం, మరణానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి చాలా స్వల్పంగా ఉంటే, వెంటనే స్పందించి చికిత్స తీసుకోవడం వల్ల అవయవాల పనితీరుపై ప్రభావం పడకుండా ఉంటుంది.
కానీ ఆలస్యం చేసే కొద్ది సమస్య మరింత పెరిగి అవయవాలు పనిచేయకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా 50 నుంచి 60 ఏళ్ల వయసు దాటిన వారిలో ఈ స్ట్రోక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామందికి ఈ స్ట్రోక్ అనేదానిని ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా అని సందేహపడుతూ ఉంటారు. మీరు అనుకున్నది కరెక్టే స్ట్రోక్ గుర్తించడానికి కొన్ని లక్షణాలు సంకేతాలుగా పరిగణించవచ్చు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖంలో బలహీనత పూర్తిగా నవ్వలేని పరిస్థితి మూతిని కళ్ళను సరిగా కదిలించలేని పరిస్థితిలో వాటికి కారణంగానే చెప్పవచ్చు. అలాగే కాళ్లు, చేతులను పూర్తిగా, ఎప్పటి మాదిరిగా కదిలించలేకపోతుంటే అది కూడా స్ట్రోక్ కు సంకేతంగా భావించాలి.
అలాగే సరిగ్గా మాట్లాడకపోవడం కూడా సంకేతంగా పరిగణించవచ్చు. అలాగే స్ట్రోక్ సమయంలో కంటి చూపులోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. మెదడులో వెనుక భాగంలో స్ట్రోక్ వస్తే కంటి చూపులో ఒకవైపు భాగం ప్రభావితమవుతుంది. ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే అది కూడా స్ట్రోక్ కు సంకేతగా భావించాలి. మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఇలా వస్తుంది. రక్తపోటు 200 దాటిపోయినప్పుడు కొందరిలో మెదడు రక్త నాళాలు చిట్లిపోతాయి. ఆ సమయంలో తలనొప్పి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు తిమ్మిర్లు కూడా కనిపిస్తాయి. శరీరంలో ఒకవైపు భాగంలో తిమ్మిర్లు, స్పర్శ కోల్పోయినట్టు ఉంటే అది కచ్చితంగా స్ట్రోక్ వచ్చినట్టు భావించాలి. తల తిరగడం, శరీరంపై నియంత్రణ కోల్పోవడం కూడా కనిపిస్తాయి. వాంతులు కూడా కావచ్చు. కాబట్టి వీటిల్లో ఏవి కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.