Jaggery Water: ప్రతిరోజు ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?
సాధారణంగా ప్రతి ఒక్కరి వంటగదిలో బెల్లం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. బెల్లంను అనేక రకాల వంటలలో ఉపయోగించడంతోపాటు బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు
- By Nakshatra Published Date - 09:30 PM, Mon - 31 July 23
సాధారణంగా ప్రతి ఒక్కరి వంటగదిలో బెల్లం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. బెల్లంను అనేక రకాల వంటలలో ఉపయోగించడంతోపాటు బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలామంది చక్కెర కంటే బెల్లం తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2, ఈ లాంటి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. శీతాకాలం మన డైట్లో బెల్లం చేర్చుకుంటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. వేడినీటిలో బెల్లం కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి గొప్ యాంటీడోట్లా పని చేస్తుంది. ఇది న్యాచురల్ డైజెస్టివ్ ఎంజైమ్లను మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియ వేగంగా జరిగేలా చేస్తంది, కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బెల్లంలోని పోషకాలు జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి. బెల్లంలో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి. శరీరాన్ని రిలాక్స్ చేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. బెల్లం నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, ఆహార పైపులు, కడుపు, పేగులను కూడా శుభ్రపరుస్తుంది. బెల్లం నీరు.. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.
బెల్లంలో మెగ్నీషియం, విటమిన్లు బి1, బి6, సీ మెండుగా ఉంటాయి. దీనితో పాటు, బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీరం ఇన్ఫెక్షన్ లతో సమర్థవంతంగా పోరాడుతుంది. అలాగే బెల్లం నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్, మినరల్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది, కొవ్వును తగ్గిస్తుంది. బెల్లం నీరు ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయం కూడా వస్తే.. బెల్లం, చియా సీడ్స్, నిమ్మకాయ, పుదీనా ఆకులు తీసుకుండి. బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు నీటిలో మరిగించండి. 10-15 నిమిషాలు పాటు చల్లారనివ్వాలి. దానిలో నిమ్మరసం పిండండి. మీరు దానిలో చియా సీడ్స్, పుదీనా ఆకులు వేసుకుని తాగవచ్చు.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.