Health Benefits: కంటిచూపు తగ్గకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసా?
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ వస్తువులకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల
- By Nakshatra Published Date - 04:36 PM, Tue - 2 January 24
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ వస్తువులకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, లాప్టాప్ లు వంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తూ వినియోగిస్తున్నారు. గంటల తరబడి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని ఉపయోగించడం వల్ల చిన్న వయసుకే కంటిచూపు సమస్యలు మొదలవుతున్నాయి. ఈ జనరేషన్ తల్లిదండ్రులు చిన్న పిల్లలకు తప్పు అని చెప్పాల్సింది పోయి ఏడ్చిన ప్రతిసారి సెల్ ఫోన్లను వీడియోలను ఆడుకోమని చెబుతూ పిల్లలను మరింత చెడగొడుతున్నారు. వీటిని ఎక్కువగా చూడడం వలన కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి.
అందులో ముఖ్యంగా కంటి నుంచి నీరు కారడం, కంటి చూపు తగ్గడం లాంటివి బాగా వస్తున్నాయి. చిన్న వయసులోనే కళ్లద్దాలను ధరిస్తున్నారు. మొబైల్స్ ను, టెలివిజన్ లు చూడడం ఎలాగూ ఆపరు. కనీసం రోజు ఈ ఆకుల రసాన్ని తాగితే కంటి సమస్యలు దూరం అవుతాయి. ఇంతకీ ఆ ఆకులు ఏవి? వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు మనం ఎక్కువగా ఉపయోగించే ఆకుకూరల్లో కరివేపాకు, కొత్తిమీర కూడా ఒకటి. వీటిని కూరల్లో వేసినప్పటికీ చాలామంది తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరను తీసుకుంటే అందులో 3 గ్రాముల మాంసకృత్తులు, రెండు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది.
అలాగే విటమిన్ సి 130 గ్రాములు, క్యాల్షియం 180 గ్రాములు ఉంటుంది. అంటే పాలలో కంటే కొత్తిమీర లోనే క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది. కొత్తిమీరలో ముఖ్యంగా కంటిచూపును పెంచే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది. కనుక ప్రతిరోజు ఉదయాన్నే కొత్తిమీర ఆకులను జ్యూస్ గా చేసుకోని త్రాగడం వలన కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అలాగే డయాబెటిస్ రావడానికి కారణం ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ శరీరంలో తక్కువగా ఉంటే డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అయితే ఈ కొత్తిమీర బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరను రోజు తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు రావు. అందుకే ప్రతి కూరల్లో దీనిని వినియోగించుకోవచ్చు. అలాగే కొత్తిమీరలో ఉండే ఫార్మేటోలియిక్ యాసిడ్ మన బాడీలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కనుక రోజు కొత్తిమీర ను తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. కొత్తిమీరను ఎక్కువ సేపు నూనెలో వేయించకూడదు.
దానివళ్ల వాటిలో ఉండే అన్ని పోషకాలు నశిస్తాయి. కనుక వీలైనంత వరకు ఉదయాన్నే కొత్తిమీర జ్యూస్ ను త్రాగడం మంచిది. అలాగే కొత్తిమీర లో ఉండే పెట్రోసిలీనిక్ యాసిడ్ అనేది మన శరీర సౌందర్యాన్ని పెంచుతుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు రాకుండా చేస్తుంది.అలాగే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. కనుక కొత్తిమీరను ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో వాడండి. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కొత్తిమీరను వినియోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.