Dry Fruits Health Benefit: పాలల్లో ఎండు ద్రాక్ష ఉడికించి తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్ లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు
- By Nakshatra Published Date - 01:00 PM, Sun - 4 September 22
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్ లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. ఎండు ద్రాక్షలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల మంచి మంచి పోషకాలు ఉన్నాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మార్కెట్లో చాలా రకాల ఎండుద్రాక్షలు సులభంగా దొరుకుతాయి. ఎండిన ద్రాక్ష పండ్లనే ఎండు ద్రాక్ష అని పిలుస్తారు. ఇవి చాలా తీపిగా ఉంటాయి. నిజానికి ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కిస్మిస్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలు తొలగిపోతాయి.
అలాగే నరాల నిస్సత్తువ,రక్త పోటు వంటి ధీర్ఘకాల వ్యాధులు తగ్గుతాయి. అలాగే గొంతు సమస్యతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. వీటిని నీళ్లలో నానబెట్టి పిల్లలకు ఇస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అదేవిధంగా శరీరానికి కావాల్సినంత ఐరన్ కూడా లభిస్తుంది. అధిక శక్తి,బరువు పెరగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మరి ఎన్నో పోషకాలు ఉన్న ఈ ఎండు ద్రాక్షను పాలల్లో ఉడికించి తాగితే వాటి వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండుద్రాక్షని పాలలో ఉడికించుకొని తాగడం వల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.
చాలామంది మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తూ ఉంటుంది. అటువంటి వారు వేడి నీటిలో ఎండు ద్రాక్షను వేసి వేడిచేసి తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎండు ద్రాక్షను తినే ముందు వాటిని నీటిలో కడిగి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఎండుద్రాక్ష వల్ల ఇవే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఎండు ద్రాక్షని రోజుల్లో మితిమీరిపు తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.