Beauty Tips: మీ అందం రెట్టింపు అవ్వాలంటే ఇలా ఆవిరి పట్టాల్సిందే?
చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆవిరి పట్టుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:30 PM, Tue - 20 August 24

సీజన్ తో సంబంధం లేకుండా చాలామందికి చర్మ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ చర్మ సమస్యల కారణంగా చాలామంది అందవిహీనంగా కనిపించడంతోపాటు నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బాయిలు అందం విషయంలో అంతగా జాగ్రత్తలు పాటించకపోయినా, అమ్మాయిలు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ద వహిస్తూ ఉంటారు. ముఖంపై మొటిమలు మచ్చలు, ముడతలు వంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు ఫేషియల్ స్టీమ్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలలో ధూళి చేరి మొటిమలకు దారి తీస్తుంది. మొటిమలు ముఖంపై మచ్చలను కలిగిస్తాయి.
ముఖంపై ఆవిరి పట్టడం వల్ల అనేక సమస్యలు నయం అవుతాయి. ఆవిరి పట్టడం, దానికి కొన్ని సహజ మూలికలను జోడించడం ద్వారా ముఖం అందం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మం హైడ్రేట్ అయినప్పుడు, చర్మం స్థితిస్థాపకత సరిగ్గా నిర్వహించగలరు. మనం ముఖానికి రాసుకునే ఆయిల్ ముఖాన్ని తేమగా ఉంచుతుంది. కానీ చర్మం హైడ్రేటెడ్ గా ఉండటానికి ఎక్కువ నీరు అవసరం. ఫేషియల్ స్టీమ్ చర్మం హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఫేషియల్ స్టీమ్తో ముఖాన్ని చూసుకునే టోనర్, సీరం మొదలైన ఉత్పత్తులు చర్మంలోకి లోతుగా వెళ్లి చర్మానికి సరైన పోషణను అందిస్తాయి. ఆవిరి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.చర్మానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది.
రక్త ప్రసరణ చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ను ప్రేరేపిస్తుంది. ఎలాస్టిన్ ఫైబర్స్ చర్మం ముడతలను తగ్గిస్తాయి. చర్మ కణాలలో సెబమ్ చిక్కుకున్నప్పుడు మొటిమలు ఏర్పడతాయి. మనం ఆవిరి పట్టినప్పుడు, సెబమ్ తొలగిపోతుంది. మొటిమలు తొలగిపోతాయని చెబుతున్నారు.
పొడి చర్మం ఉన్నవారు 2 నుండి 3 బిర్యానీ ఆకులను , 1 టేబుల్ స్పూన్ సోపు గింజలను గ్రైండ్ చేసి వేడి నీటిలో రోజ్ వాటర్ లేదా రోజ్ వాటర్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల మృత తొలగిపోయి ముఖంలో మెరుపు పెరుగుతుంది. ముఖంపై జిడ్డు సమస్యతో ఇబ్బంది పడేవారు..
గ్రీన్ టీ బ్యాగ్, తులసి ఆకులు , చిన్న నిమ్మకాయ ముక్కలతో పాటు వేడి నీటిలో 2 3 బిర్యానీ ఆకులు, 5 7 వేప ఆకులు వేసి ఆ నీటిని బాగా మరిగించి ఆవిరి పట్టాలి. దీంతో ఆయిల్ స్కిన్ సమస్య దూరం అవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నవారు.. 5 గుమ్మడికాయ ముక్కలు, గ్రీన్ టీ బ్యాగ్ , 5 చుక్కల లావెండర్ నూనెను నీటిలో వేసి ఆవిరి తీసుకోవాలి. ఇది చర్మంపై చికాకును తొలగిస్తుంది. ఈ విధంగా అప్పుడప్పుడు ముఖానికి ఆవిరి పడుతూ ఉండడం వల్ల చర్మ సమస్యలు రావు అని చెబుతున్నారు.