HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Worship These Two Plants On Vijayadashami Financial Crisis Will Go Away

Dussehra: దసరా రోజు ఈ రెండు మొక్కలు పూజిస్తే చాలు.. ఆర్థిక సమస్యలు తొలగిపోవడం ఖాయం!

దసరా పండుగ రోజున రెండు రకాల మొక్కలను పూజిస్తే మీకు తిరుగే ఉండదు అని అంటున్నారు.

  • By Anshu Published Date - 10:00 AM, Fri - 20 September 24
  • daily-hunt
Dussehra
Dussehra

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. ఈ పండుగను దాదాపుగా 9, 10 రోజులపాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక పెద్దపెద్ద దేవాలయాల్లో అమ్మవార్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. రావణునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ దసరా పండుగకు అపరాజిత మొక్క అనగా శంఖు పుష్పం అలాగే జమ్మి మొక్కలను పూజించే ఆచారం ఎప్పటినుంచో ఉంది.

దసరా రోజు ఈ రెండు మొక్కలను పూజిస్తే శ్రీ రాముని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మన ఇంట్లో లక్ష్మీదేవి నివస్తుందని కూడా పండితులు చెబుతున్నారు. ఈ పండుగ రోజు శంఖు మొక్కను ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. దసరా రోజు శంఖు మొక్కపై పాలు, నీరు కలిపి పోయాలి. ఆ తర్వాత ఈశాన్య దిశలో అపరాజిత దేవిని పూజించాలి. ముందుగా ఈశాన్యం దిక్కు స్థలాన్ని శుభ్రం చేసి ఆవు పేడతో కప్పాలి జల్లాలి. అలాగే ఆ ప్రదేశాన్ని ముగ్గుతో అలంకరించాలి. అమ్మవారికి నైవేధ్యాన్ని సమర్పించి హారతితో పూజను ముగించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది.

ఇంటికి ఈశాన్య దిశలో జమ్మి మొక్కను నాటడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. దసరా రోజున దీన్ని ఇంట్లో నాటితే దాని ప్రభావం మరింత పెరుగుతుందంటారు. జమ్మి మొక్కను సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందుకే విజయదశమి రోజు జమ్మి మొక్క ముందు దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. విజయదశమి నాడు జమ్మి వృక్షం ఆకులను ఇంటికి తీసుకొస్తే మంచిదంటారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dussehra
  • Dussehra 2024
  • plants
  • pooja
  • shanku

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd