HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >What Is The Story Behind The Tradition Of Ganesh Visarjan 2

Ganesh Nimajjanam 2024: గణేష్ విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కారణం గురించి తెలిపారు.

  • By Anshu Published Date - 02:30 PM, Mon - 9 September 24
  • daily-hunt
Ganesh Nimajjanam 2024
Ganesh Nimajjanam 2024

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో మనకు తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలలో వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ వినాయక చవితి ఉత్సవాలు జరగడం అన్ని ఒక ఎత్తు అయితే నిమజ్జనం మరొక ఎత్తు అని చెప్పాలి. దాదాపు రెండు మూడు రోజులపాటు ఈ నిమజ్జన వేడుకలు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ అలాగే ముంబై లాంటి ప్రదేశాలలో వినాయకుల నిమజ్జనం చేయడానికి ఒక్కొక్కసారి రెండు రోజులు సమయం పడుతుంది.

అయితే ఇలా వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అసలు వినాయక విగ్రహాలను నీటిలో ఎందుకు నిమజ్జనం చేయాలి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రకృతి పరంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు.చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటంది.

అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయని చెబుతున్నారు. అటువంటి ఆయుర్వేద గుణాలు ఉన్న నీటిని తాగడం వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక , అలాగే విఘ్నేశ్వరుడికి పూజించే 21 ఆకుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. దీని వల్ల నీరు శుద్ధి అవుతుంది. వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం… వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు.

భూలోకానికి వచ్చిన వినాయకుడు పది రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, పదిరోజుల పాటు నిత్యం పూజలందుకుని, తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. దీనికి మరో కారణం కూడా ఉందంటారు. ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేసే విషయం గురించి మనకు తెలిసిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ganesh Nimajjanam
  • Ganesh Nimajjanam 2024
  • vinayaka chavithi
  • Vinayaka Chavithi 2024

Related News

Khairatabad ganesh: Sri Vishwashanti Mahashakti Ganapati who has entered the lap of Ganga

Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

భారీ భద్రత నడుమ, ఉత్సవసమితి సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం, 70 టన్నుల ఈ బడా గణేశుడిని క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ప్రతీ అడుగులోనూ "గణపతి బప్ప మోరియా" నినాదాలు మారుమోగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణనాథుని దర్శించుకునేందుకు ఎగబడ్డారు.

  • Khairatabad Maha Ganapati procession in splendor

    Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Raja Singh objects to police restrictions.. Where is your right to control Hindu festivals? !

    Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

  • Massive security arrangements for Ganesh immersion.. 29 thousand personnel deployed

    Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd