Vastu Tips: పొరపాటున కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలు అస్సలు పెంచకూడదట.. ఎందుకో తెలుసా?
మన ఇంటి దగ్గర ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద పొరపాటున కూడా కొన్ని రకాల మొక్కలను అసలు పెంచకూడదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
- By Anshu Published Date - 06:30 AM, Sat - 4 October 25

Vastu Tips: మామూలుగా చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద రకరకాల పూల మొక్కలు సోకేస్ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవడం మంచిదే కానీ, అందులో కొన్ని రకాల మొక్కలు ప్రతికూలతలను పెంచుతాయట. కాగా ఇంటి వద్ద పండ్లు,పువ్వులు ఆకులతో నిండిన నీడ చెట్లు ఇంటికి అందాన్నిస్తాయట. చెట్లు, మొక్కలు ఇంటిని మాత్రమే కాకుండా చుట్టు పక్కల వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాయని చెబుతున్నారు.
కానీ ఇంటి వద్ద మొక్కలు నాటేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు పండితులు. ఎందుకంటె ఇంటి ప్రధాన ద్వారం లేదా తలుపు దగ్గర కొన్ని చెట్లు, మొక్కలు ఉండటం మంచిది కాదట. ఇలాంటి చెట్లు అశాంతి, ఆర్థిక సమస్యలు, ప్రతికూలతను పెంచుతాయని చెబుతున్నారు. మనీ ప్లాంట్ దీనిని ధనం మొక్క అని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క శుక్ర గ్రహానికి సంబంధించినది. ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటిలో సరైన దిశలో లేదా స్థలంలో నాటితే చాలా లాభం ఉంటుందట.
కానీ మనీ ప్లాంట్ ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి బయట నాటకూడదట. దీనివల్ల ధన నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం రావి చెట్టు ఇంటి గుమ్మానికి దగ్గరగా ఉండకూడదట. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటిన రావి చెట్టు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే రావిని హిందూ ధర్మంలో పవిత్రమైన వృక్షంగా భావించినప్పటికీ ఈ చెట్టుని మాత్రం ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం దగ్గర నాటకూడదట. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముళ్లు లేదా పాలు వచ్చే మొక్కలను ఉంచకూడదట. ఇది పొరుగువారితో లేదా బంధువులతో సంబంధాలను దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చింత, మందార, రేగు వంటి చెట్లు కూడా ఉండకూడదట. ఇంటి దగ్గర చింత చెట్టు ఉండటం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందట. వాస్తు ప్రకారం, మందార మొక్క కూడా ఇంటి ముందు ఉండటం అశుభంగా భావించాలట.